ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో సీరియస్ గా ఉందో అందరికి తెలిసిన విషయమే. ఈ విషయంలో జగన్ ఎక్కడా కూడా వెనక్కు తగ్గే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. రాజధాని విషయంలో తాను చెయ్యాలి అనుకున్నది చెయ్యడానికి గాను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కూడా ఒప్పించడానికి జగన్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆయన రాజధాని విషయంలో ఏ స్థాయిలో పట్టుదలగా ఉన్నారో అందరికి అని  స్పష్టంగా అర్ధమవుతూనే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

 

రాజకీయాల్లో తాను ఏది అనుకుంటే అదే చేయగల సత్తా ఉన్న నేత జగన్. అసెంబ్లీ సీటు ఇచ్చే విషయమైన, మంత్రి పదవి ఇచ్చే విషయమైన మరొకటి అయినా సరే జగన్ అనుకున్నది చేసే నాయకుడు. ఈ విషయం చంద్రబాబుకి ఇప్పుడు, ఇప్పుడు అర్ధమవుతూ వస్తుంది. రాజకీయంగా చంద్రబాబు ఎన్నో ఎత్తులు పల్లాలు చూసి ఉండవచ్చు గాని జగన్ లాంటి నాయకుడ్ని మాత్రం చంద్రబాబు చూడలేదు. రాజధానిని మండలి ద్వారా ఆపాలని అని  చంద్రబాబు ప్రయత్నాలు చేసారు. కాని అనూహ్యంగా మండలిని రద్దు చేస్తూ తీర్మానం ఆమోదించారు. 

 

 

ఆ బిల్లు కేంద్రం వద్ద ఉంది. కేంద్రం గనుక బిల్లు ఆమోదిస్తే మాత్రం జగన్ అనుకున్నది జరుగుతుంది. అందుకోసం జగన్ ఇప్పుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుకి కూడా సినిమా స్పష్టంగా అర్ధమైంది. అందుకే ఆయన రాజధాని తరలింపు విషయంలో ఏమీ చేయలేక, భూములు కొన్న తన పార్టీ నేతల కోసం రాజధాని వెళ్ళడం లేదనే విషయాన్ని పదే పదే చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయంగా తనను ఇబ్బంది పెడుతుంది అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు. కాబట్టే ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: