మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెచ్చరిల్లి పోతున్నాయి.. ఎన్నో చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్నా కూడా హత్యలు, అత్యాచారాలు ఆగడం లేదు. చట్టాలు పెరిగే కొద్దీ దారుణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి..నిన్న కాక మొన్న దిశ లాంటి సంఘటనలు జరిగినా కూడా కామాంధుల లో మార్పులు రావడం లేదు.. ఇటీవల గోవాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది..అతి కిరాతకంగా మహిళలను చంపేసి హత్య చేశారు..
28 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి అనంతరం కిరాతకంగా చంపేశారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఫిబ్రవరి 10న పోర్వోరిమ్ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలు స్వస్థలం ఒడిశా అని.. గత కొద్ది కాలంగా గోవాలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. పని చేసుకుంటూ వస్తున్న ఆమె ఇద్దరితో సన్నిహితంగా ఉండేదని అలా పరిచయం ఇప్పుడు ఆమె ప్రాణాలను తీసిందని తెలుస్తుంది..
గోవా అడవుల్లో కుళ్లి పోయిన మృత దేహం వెలుగు చూడటం తో స్థానికులు పోలీసు లకు సమాచారాన్ని అందించారు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు..అక్కడ వారికి తెలిసిన నిజాలు అందరిని నోర్లు వేళ్ళ బెట్టుకొనేలా చేస్తున్నాయి..
ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళను 16 ఏళ్ల బాలుడితో పాటు మరో వ్యక్తి కలిసి రేప్ చేసి చంపేశారని పోర్వోరిమ్ డీఎస్పీ ఎడ్విన్ కోలాకో చెప్పారు. వీరిద్దరు ఆమెపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని ఆయన తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి మరో వ్యక్తి సహకరించాడని ఆ ఇద్దరికీ కోసం గోవాను జల్లెడ పట్టిస్తున్నారని సమాచారం..