రాజకీయాలు అంటేనే రాచపుండు లాంటివి..  ఒక్క సారి రాజకీయాల్లో చేరాక చచ్చేదాక నటించవలసిందే.. కక్షలతో బ్రతకవలసిందే. నేటి రాజకీయ పరిస్దితులను గమనిస్తే జరుగుతుంది ఇదే... ఒక్కోసారి రాజాకీయాల్లో ఎప్పుడో తనకు చేసిన అన్యాయాలను, అవమానాలను సమయం దొరికినప్పుడల్లా తవ్వుతూనే ఉంటారు కొందరు నాయకులు.. ఇది వారి నాలుకకు రాజకీయం అనే దురద అంటించిన లక్షణం...

 

 

ఇకపోతే లక్షలమంది అభిమానులను తన నటనతో సంపాదించుకున్న నల్ల బంగారం బాబుమోహన్ రాజకీయాల్లోకి వచ్చి కొంతకాలం పదవులు కూడా ఏలాడు.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలవల్ల పార్టీలు మారుతూ చివరికి బీజేపీ నీడన చేరాడు.. ఇకపోతే తాజాగా నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న ఈ నటుడు పలు సంచలన వాఖ్యలు చేసారు.

 

 

అదేమంటే, ఆందోల్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై విరుచుకు పడుతూ, ఈ ఎమ్మెల్యే ను నియోజకవర్గ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరికి వచ్చాయని,కేవలం 6 నెలల్లోనే. ప్రజలు విరక్తి చెందారని విమర్శించారు... ఇదే కాకుండా ప్రస్తుతం క్రాంతి కిరణ్ నివాసం ఉంటున్న ఇల్లు కూడా కబ్జా చేసిన భూమిలో కట్టిందే అని , దమ్ముంటే మీడియా సంస్థలు వాస్తవాలను వెలికి తీయాలని సవాల్ చేశారు.

 

 

దీని తర్వాత విషయాన్ని కేసీయార్ వైపు మళ్ళీస్తూ, చిత్రపురి కాలనీ మొత్తం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిందని, దాసరి నారాయణరావు ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని, దీనికంతటికి కారణం, ప్రముఖ నిర్మాతలు అందరు కేసీయార్‌కు భజన చేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు..

 

 

ఇదేకాకుండా కేసీయార్, కేసీయార్ కుటుంబం వల్లే నేను జీవితంలో నష్టపోయానని, వీరంతా కలిసి ఎన్నికల్లో నాకు టికిట్ ఇవ్వలేదని తెలిపారు.. ఇకపోతే తెలంగాణాలో బీజేపీకి మంచిరోజులు వస్తాయని, రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయమంటూ పేర్కొన్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: