తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు తమ రాజకీయ శత్రువు ఎవరో తేల్చుకోలేక పోతున్నారా..? అధిష్టానం ఇచ్చే కార్యాక్రమాలు అన్నీ... బీజేపీకి వ్యతిరేకమైనవే అయినా... ఇక్కడ పార్టీకి కలిసి వచ్చేదేముంది..? దేశ రాజకీయం ఒక ఎత్తయితే...తెలంగాణ పాలిటిక్స్ మరో ఎత్తు. తెలంగాణలో బీజేపీని టార్గెట్ చేయటం వల్ల లాభమేంటని తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. 

 

తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు చాలా రోజుల నుంచి క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మా రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీనే అని ప్రకటిస్తున్నప్పటికీ... కాంగ్రెస్ నాయకులకు ఇంకా క్లారిటీ రావటం లేదు. అధిష్ఠానం కూడా బీజేపీకి వ్యతిరేకంగా కార్యాచరణ ఇస్తోంది. దేశంలో ఆర్ధిక స్ధితికి బీజేపీ విధానాలే కారణం అంటూ దీక్షలకు పిలుపు నిచ్చింది. ఇప్పుడు తాజాగా...రిజర్వేషన్లపై కేంద్రం తీరును తప్పు పడుతూ మళ్లీ ఈ నెల 16న ధర్నాలు చేయాలని పిలుపునిచ్చేసింది. దేశ వ్యాప్తంగా జరిగే ఆందోళనలో భాగంగా...మండల స్ధాయి వరకు ఆందోళనలు వెళ్లాలని సూచించింది.

 

అధిష్ఠానం ప్రకటించిన కార్యాచరణపై తెలంగాణ కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు విషయాల్ని వదిలేసి.. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన కూడా ఉంది. తెలంగాణమలో కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధిని గుర్తించలేకపోతుందనే అభిప్రాయానికి వచ్చేశారు నేతలు.

 

తెలంగాణలో... అధికార టీఆర్ఎస్ పార్టీకి... ప్రత్యర్ధి పార్టీ మాత్రం కాంగ్రెస్సే. కానీ ఇటీవల బీజేపీ హడావుడి చేస్తూ...మేమే ప్రత్యామ్నాయం అంటు నిలబడే ప్రతయ్నాలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రత్యర్ధి పార్టీ అనే విషయాన్ని మర్చిపోయినట్టే ఉంది. రాష్ట్ర స్ధాయిలో... ఉద్యమ కార్యాచరణ అంతా... కాంగ్రెస్...టీఆర్ఎస్ మధ్యే ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంతగా ప్రభావితం చూపని బీజేపీ లక్ష్యంగా ఆందోళనలు చేయటంతో... బీజేపీ - కాంగ్రెస్ మద్య ఫైట్ గానే మారిపోయి.. అధికార టీఆర్ఎస్ పార్టీ లాభపడుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు కొందరు నాయకులు. 

 

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉద్యమాలు చేయటం మానేసి....బీజేపీని టార్గెట్ చేయటం వల్ల రాజకీయంగా కాంగ్రెస్ వచ్చే లాభమేమీ ఉండదనే వాదన ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ మీద మాజీ కేంద్ర మంత్రి చిదంబరంతో సెమినార్ నిర్వహించారు. దీంట్లో కూడా ఎక్కువగా బీజేపీ లక్ష్యంగానే కార్యాచరణ జరిగింది. బీజేపీ ని వదిలేసి... తెలంగాణ లో ప్రత్యర్ధి పార్టీ...సీఎం కేసీఆర్ లక్ష్యంగా సమస్యల పై పోరాటం చేస్తే ఉద్యమాలకు ఊతం ఇచ్చినట్టువుతుంది. దాంతో కాంగ్రెస్.... కేసీఆర్ ని బలంగానే ఢీ కొట్టే ప్రయత్నం చేస్తుందనే టాక్ జనంలోకి వెళ్తుంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశం. కొందరు సీనియర్లు కూడా ఇదేరకమైన అభిప్రాయంతో ఉన్నారు. 

 

తెలంగాణలో రాజకీయ అవసరాలు...  ప్రత్యర్ధి ఎవరనేది గుర్తించి ఉద్యమాలు చేయాలన్నదే ప్రధాన అంశం. ఇప్పటి వరకు.. టీఆర్ఎస్- బీజేపీ ఒకటే అని చెప్పినా...ఆశించిన రీతిలో కాంగ్రెస్ కి వర్కవుట్ కాలేదు. కానీ... టీఆర్ఎస్ లక్ష్యంగా ఉద్యమాలు చేయటం మానేసి... ఏఐసీసీ ఇచ్చే కార్యాచరణకే పరిమితం కావడంపై నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: