మద్యం మత్తు లో కొందరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. తాగి ఒక పద్దతిగా ఉంటే పర్వాలేదు కానీ తాగి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు కొందరు. ఇక వాళ్ళు ఏమీ చేయకపోయినా పర్వాలేదు గాని ఏదొకటి చేయకుండా ఉంటే చాలు. తాజాగా ఒక యువకుడు తాగి ఏ విధంగా మరణించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మద్యం మత్తులో అతనికి ఏ విధంగా మరణం వచ్చిందో తెలిస్తే అయ్యో పాపం అనక మానం. ఇలా కూడా చచ్చిపోతారా అంటూ నోరు వెళ్ళబెట్టె పరిస్థితి ఉంటుంది. అసలు ఎం జరిగింది...? ఎలా జరిగింది...? ఈ స్టోరీ లో చూద్దాం. 

 

ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. మిజోరాం రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ళ లాల్‌ నుంచమ సొంత రాష్ట్రంలో ఉపాధి లభించక ఉపాధి కోసం అని తెలంగాణా రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాకు వలస వచ్చాడు. శామీర్‌ పేట మండలం బొమ్మరాశి పేట లోని ఓ రిసార్ట్స్‌లో పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టిన రోజు వేడుకులకు ఆహ్వానం వచ్చింది. ఇక దొరికిందే సందు కదా అని హాయి గా పీకల వరకు తాగాడు. అంత వరకు బాగానే ఉంది గాని అక్కడే ఒక ఘటన జరిగింది. 

 

బండి మీద ఇంటికి వెళ్ళాడు. అదే తాను ఉండే రూమ్ కి వెళ్లి మంచం మీద పడుకున్నాడు. ఉదయమే అతనితో పాటు ఉపాధి కోసం వచ్చిన  అతని ఫ్రెండ్ లాల్‌మాల్‌ సౌమ లేచి చూడగా లాల్ కింద పడిపోయి ఉన్నాడు. అపస్మారక స్థితిలో ఉండటంతో కంగారు కంగారుగా పోలీసులకు, రిసార్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు 108 సిబ్బందికి సమాచార౦ అందించారు. హుటాహుటిన వచ్చిన సిబ్బంది అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. అయితే అసలు మరణానికి కిందపడటమే కారణమా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: