అమ్మ రక్త మాంసాలను ధారపోసి తొమ్మిది నెలలు మోసి జన్మనిస్తే.. భూమ్మీద పడినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉండేది తండ్రికి మాత్రమే..అయితే అలాంటి తండ్రి కూతురిపై కన్నేసి అత్యాచారం చేస్తే .. ఇంకా సభ్యసమాజం ఎం మెసేజ్ యిస్తారో చూడాలి.. రక్తం పంచిన తండ్రి  కామాంధుడు అయ్యి చరిచాడు..అలా ఆమెకు కడుపు కూడా చేశాడు..ఇంకా సమాజంలో ఆడపిల్లలు ఎలా బ్రతుకుతారు.. 

 

 

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామంతో కూతురిని కాటేశాడు. నిత్యం లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో కూతురిపై తరచూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కడుపునొప్పితో బాధపడుతోందని బాలికను ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఆమె ఇప్పుడు ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

 


దారుణ ఘటన పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో చోటుచేసుకుంది. నేపాల్ నుంచి ఓ కుటుంబం పొట్టకూటి కోసం వలస వచ్చి పటియాలాలో స్థిరపడింది. భార్యకు మతిస్థిమితం లేకపోవడంతో కూతురిపై కన్నేశాడు తండ్రి. తరచూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి మరీ కూతురిపై నీచానికి దిగాడు.తల్లికి మతి స్థిమితం లేకపోవడంతో ఈ దారుణం జరిగింది..

 

అతని ఆగడాలకు అడ్డులేకుండా పోయాయి. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆమె ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు. కన్నతండ్రే ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కామాంధుడిపై కేసు నమోదు చేశారు.అప్పటి నుంచి తండ్రి పరారీలోనే ఉన్నాడు. అయితే తండ్రిపై కేసు పెట్టకుండా బాలికపై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు బాలిక స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పటియాలా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఇటీవలే ఓ బిడ్డకు జన్మనచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి: