ఎంతో ఇష్టంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు... పెళ్ళితో ఒక్కటై  కలకాలం సంతోషంగా జీవించాలి అనుకున్నారు...వీరి ప్రేమను  పెద్దలు ఒప్పుకోలేదు.. అయినప్పటికీ పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు... ఎంతో హాయిగా జీవితం గడపాలి  అనుకుంటున్న సమయంలో... పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా గడవకముందే యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ యువతి కన్న వారి కుటుంబంలో విషాదం నిండిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అల్వాల్ హస్మత్ పేట లోని చిత్రీగడ  బస్తీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

 


 వివరాల్లోకి వెళితే... అల్వాల్ హస్మత్ పేట లోని ఛత్రిగడ లో నివసించే 23 ఏళ్ల శిరీష... సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కొంతకాలం పాటు ప్రేమించుకుని  నాలుగు నెలల క్రితం తమ ప్రేమను పెద్దలకు  తెలిపారు. కానీ పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించక పోవడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. సతీష్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా..  శిరీష ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. అయితే మొదట్లో ఎంతో సంతోషంగా గడుస్తున్న సమయంలో ... సతీష్ చెడు అలవాట్లకు బానిస అయ్యారు. పనికి కూడా సరిగా వెళ్ళేవాడు కాదు. రోజు భార్య శిరీష ను తీవ్రంగా వేధించేవాడు. 

 

 దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం శిరీష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి జరిగి ఆరునెలలు కూడా జరగకముందే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది శిరీష. ఇంటికి వచ్చిన భర్త సతీష్ ఫ్యాన్  వేలాడుతూ శిరీష  విగతజీవిగా కనిపించింది. దీంతో షాక్ అయి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తమ కూతురును  భర్తే చంపి ఆత్మహత్యగా  చిత్రీకరిస్తున్నాడు అంటూ ఆలోచిస్తున్నారు శిరీష  తల్లిదండ్రులు ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: