తలసాని శ్రీనివాస్ యాదవ్... తెలంగాణా మంత్రి. తెరాస లో కీలక నేత. తెలుగుదేశం నుంచి వచ్చినా కొంత కాలానికే కెసిఆర్ మీద భక్తి చాటుకోవడంతో ఎమ్మెల్యే గారికి చాలా గుర్తింపు వచ్చింది. అనుకోకుండా ఎమ్మెల్యే గారు కాస్తా మంత్రి గారు అయ్యారు. గత ప్రభుత్వంలో కీలక శాఖ నిర్వహించిన మంత్రి గారు ఆ తర్వాత తనకు ఉన్న ఫాలోయింగ్ సహా పలుకుబడి తో కొడుక్కి ఎంపీ సీటు ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఆయన మళ్ళీ మంత్రి పదవిలో ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడూ కెసిఆర్ మీద తనకు ఉన్న భక్తిని చాటుకుంటూ ఉంటారు. 

 

తాజాగా కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రిగారు చాలా మార్కులు కొట్టేసారు. వంద కి వంద మార్కులు ఆయన ఖాతాలో వేసుకున్నారు. తన నియోజకవర్గం నుంచి ఉప్పల్ వరకు, తన నియోజకవర్గం నుంచి బంజారాహిల్స్ వరకు, తన నియోజకవర్గం నుంచి పఠాన్ చెరు వరకు మంత్రిగారు ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలే హైలెట్ గా నిలిచాయి. స్థానిక తెరాస నాయకులు, మంత్రి గారి వర్గం కెసిఆర్ మీద అభిమానం తో ఆయన ఎన్నో ఫ్లేక్సీలు ఏర్పాటు చేసారు. గులాబీ బాస్ మీద ఉన్న స్వామి భక్తిని చాటుకున్నారు తలసాని. 

 

కేకులు కోయడం లో కూడా తలసాని వర్గం ముందు ఉంది. సోషల్ మీడియాలో కూడా కెసిఆర్ సాబ్ అంటూ ఎక్కువగా హడావుడి చేసారు ఆయన వర్గం. ఎస్సార్ నగర్, బొరబండ పంజాగుట్ట, బేగంపేట ఇలా అన్ని ప్రాంతాల్లో తలసాని వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ఉన్నాయి. ఇక భారీగా గులాబీ రంగు కేకులను కూడా కట్ చేసారు ఆయన అభిమానులు. ఇక పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీనితో కెసిఆర్ ఫిదా అయిపోయినట్టు సమాచారం. ఇతర మంత్రులు ఎవరూ కూడా ఈ రేంజ్ లో చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: