వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ప్రతిరోజు సమాజంలో వివాహేతర సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఎన్నో కుటుంబాలు నాశ‌నం అవుతున్నాయి. అయినా జనాలు మాత్రం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మాన‌డం లేదు. కేవలం కొద్ది నిమిషాల శారీరక సుఖం తో పాటు క్షణికావేశంలో చేస్తున్న తప్పుల వల్ల ఎంతో మంది చనిపోతుంటే... ఎన్నో జీవితాలు నాశ‌నం అవుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలు తీసిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. త‌న  కొడుకు వ‌య‌స్సు ఉన్న యువ‌కుడి తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్త రోజూ రాసలీలలు కొనసాగిస్తూ వస్తోంది.

 

ఓ రోజు భర్త పనిమీద బయటకు వెళ్లడంతో ప్రియుడికి కబురు పంపింది. దీంతో అతడు ఆగమేఘాల మీద ప్రియురాలి ఇంటికి చేరుకుని బెడ్రూమ్‌లో రొమాన్స్ మొదలుపెట్టాడు. అయితే కాసేపటికే భర్త తిరిగిరావడంతో వారి బండారం బయటపడింది. ఆ భ‌ర్త‌కు వీరిద్ద‌రు అడ్డంగా దొరికి పోయారు. 
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పశువందన్‌ సమీపంలోని పుంగవర్ నత్తం గ్రామానికి చెందిన షణ్ముగం(58) రైతు. మనస్పర్థలతో చాలాకాలం క్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన అతడు మారియమ్మాళ్(46) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఎదురింట్లో ఉండే త‌న కొడుకు వ‌య‌స్సు ఉన్న యువ‌కుడు (27)తో అక్ర‌మ సంబంధం ఏర్ప‌డింది.

 

వీరిద్ద‌రు భ‌ర్త క‌ళ్లుగ‌ప్పి రోజూ రొమాన్స్ చేస్తున్నారు. ఆమె కొడుకు వ‌య‌స్సు ఉండడంతో ష‌ణ్ముగంకు కూడా అనుమానం రాలేదు. తాజాగా ఇటీల బ‌య‌ట ఉన్న భ‌ర్త పొలానికి వెళ్లాడ‌నుకున్న ప్రియుడికి ఫోన్ చేయ‌గా.. ప్రియుడు రామ్మూర్తి వ‌చ్చి నేరుగా బెడ్ రూంలోకి దూరేసి ఆమెతో రాస‌లీల‌లు కంటిన్యూ చేస్తున్నాడు. లోప‌ల చ‌ప్పుళ్లు రావ‌డంతో తొంగి చూసిన ష‌ణ్ముగం వాళ్లు రాస‌లీల‌ల్లో ఉండ‌డంతో కొడవలి తీసుకుని గదిలోకి వెళ్లి తన భార్యతో పాటు ఆమె ప్రియుడిని విచక్షణా రహితంగా నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ త‌ర్వాత అత‌డు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: