చంద్రబాబు మాజీ సెక్రటరీ నివాసంపై ఐటీ దాడుల వ్యవహారం వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు బండారం మొత్తం బయటపడిందని వైసీపీ నేతలు అంటుంటే.. టీడీపీ నేతలు మాత్రం రకరకాలుగా స్పందించారు. మొదట్లో ఈ దాడులతో మాకేం సంబంధం అన్నవారు.. ఆ తర్వాత సీన్ మార్చేశారు. శ్రీనివాస్ ఇంట్లో దొరికింది రెండున్నర లక్షలు మాత్రమేనంటూ ఐటీ పంచానామా రిపోర్టు అంటూ కొన్ని పత్రాలు విడుదల చేశారు.

 

అయితే ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం నోరు విప్పడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు శీలం నిరూపించుకునేందుకు ఓ ఐడియా ఇచ్చారు. ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి. చంద్రబాబుకు దమ్ముంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపమని ముందుకు రావాలని, విచారణ జరిపించుకొని నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

ఎప్పుడు అనుకూలం అయితే అప్పుడు నోరు విప్పుతారా..? రూ. 2లక్షల నగదు, 12 తులాల బంగారం కోసం ఆరు రోజులు సోదాలు జరుగుతాయా..? అని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తప్పు చేయకపోతే ఐటీ దాడులపై వాస్తవాలు కోరుతూ హైకోర్టులో టీడీపీ నేతలు స్వచ్ఛందంగా పిటీషన్‌ వేయాలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. ఐటీ దాడులపై సిగ్గు, లజ్జ లేకుండా టీడీపీ నేతలు బుకాయిస్తున్నారని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

 

 

పల్లెల్లో మూడు విడిచినోళ్లనే నానుడి ఉందని, టీడీపీ నేతలు మాత్రం ఆరు విడిచిన దొంగలని ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఐటీ దాడులపై టీడీపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అయినా రాజకీయాల్లో ఏదో డిమాండ్ చేస్తుంటారు కానీ.. స్వచ్ఛందంగా విచారణ జరిపించుకునేంత అమాయకులా చంద్రబాబు. ఆ మాత్రం స్పృహ వైసీపీ నేతలకు మాత్రం లేదా ఏంటి..?

మరింత సమాచారం తెలుసుకోండి: