ఈ మధ్య కాలం తో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు  సాటి మనుషులు. రోజురోజుకీ మానవత్వం మంట కలిసిపోయి హత్యలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది... బ్యాంకులో పనిచేసే ఓ యువతికి పెళ్లి కుదిరింది... ఈ క్రమంలోనే పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి... ఇంకో వారం రోజుల్లో పెళ్లి... ఇక ఆ యువతి తన సహా సిబ్బందికి శుభలేఖలు ఇచ్చి ఇంటికి వచ్చింది... కానీ ఇంతలో పరలోకాలకు వెళ్ళిపోయింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో గత రాత్రి ఈ ఘటన జరిగింది. 

 

 

 

 వివరాల్లోకి వెళితే... రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డిపేట కు చెందిన దివ్య గజ్వేల్ లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది. ఇక బ్యాంకుకు సమీపంలోనే ఓ ఇంటిపై అంతస్తులు తల్లిదండ్రులతో కలసి నివసిస్తుంది. కాగా ఇటీవలే దివ్యకు వరంగల్ కు  చెందిన ఓ యువకుడితో నిశ్చయమైంది. మరో వారం రోజుల్లో పెళ్లి... ఇక పెళ్లి పనులు కూడా చకచకా జరుగుతున్నాయి... కుటుంబం మొత్తం పెళ్లి పనుల్లో నిమగ్నం అయిపోయింది... ఈ క్రమంలోనే దివ్య తన పెళ్లి శుభలేఖలు బ్యాంకులోని సహోద్యోగులకు ఇవ్వాలని భావించి బ్యాంకుకు వెళ్లి శుభలేఖలు ఇచ్చి ఇంటికి చేరుకుంది. 

 

 

 ఇక సాయంత్రం సమయంలో కాబోయే భర్తతో చరవాణి లో మాట్లాడింది. ఇక అదే సమయంలో పెద్దగా అరిచి కుప్పకూలిపోయింది. అటువైపునుంచి చరవాణి లో మాట్లాడుతున్న కాబోయే భర్త ఏం జరిగిందని అడుగుతున్నప్పటికీ దివ్య మాత్రం సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కంగారు పడిపోయిన కాబోయే భర్త వెంటనే బ్యాంకు సిబ్బంది కి ఫోన్ చేసి చెప్పాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే దివ్య ఇంటికి వచ్చి చూసే సరికి జరగాల్సిన ఘోరం కాస్త జరిగిపోయింది. రక్తపు మడుగులో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది దివ్య. ఇక దివ్యను  వెంటనే ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే దీవ్య ను  పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని... అందుకే దివ్య తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో  దివ్యను  హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా ధరించారు. దివ్య తో పాటు ఎనిమిదో తరగతిలో కలిసి చదువుకున్న వెంకటేష్ ప్రేమ పేరుతో ఎన్నో  రోజుల వరకు వేధించాడని..అతడే ఈ హత్య చేసి ఉంటారనిదివ్య  తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: