వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు కొత్తగా మరో దొంగ నాటకం మొదలు పెట్టాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎప్పుడు ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను.. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు విజయసాయి రెడ్డి.  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి పదిసార్లు మాట్లాడేవాడట. ఆ కాల్ లిస్టు బయటకు తీస్తే దోపిడీ సొమ్ము సర్ధుబాట్లపై మరింత సమాచారం బయటికొస్తుంది. 2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకు ప్రజా చైతన్య యాత్ర అంటూ కొత్త నాటకం మొదలెట్టాడు.'' అంటూ ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి. 

 

అయితే.. చంద్రబాబు మాజీ పిఎస్ వద్ద 2 వేల కోట్ల రూపాయిలు బయటపడ్డాయి.. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పదవి పోయిన కూడా ఆ పీఎస్ తో మాట్లాడారు అని.. ఒకవేళ ఆ కాల్ లిస్టు తీస్తే.. దోపిడీ సొమ్ము సర్దుబాట్ల గురించి మరింత సమాచారం బయటకు వస్తుంది అని.. 2 వేల కోట్ల అక్రమర్దన నుంచి దృష్టి మార్చడానికే ప్రజా చైతన్య యాత్ర అంటూ నాటకాలు మొదలు పెట్టాడు అని.. ప్రజా చైతన్య యాత్ర ఇప్పుడు పెద్ద నాటకం అని విజయసాయి రెడ్డి ట్విట్ చేశాడు. 

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.. ''సార్.. బాబు గారికి 23 ఇచ్చిన.. వాటిలో కూడా ప్రస్తుతం 2 తగ్గి 21 అయ్యాయి. అయినా సరే చంద్రబాబు బుద్ధి మారలేదు.. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర.. మరో పక్క దత్త పుత్రుడు 'లంగా మార్చ్'లతో ఏపీలో వైసీపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారని వాళ్ళ ఫీలింగ్.. ఎం చేస్తాం''.. అలాగే అనుకోని లెండి అంటూ ట్విట్ చేసారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: