చంద్రబాబునాయుడు ఎంత పిరికివాడో జనాలందరికీ అర్ధమైపోయింది.  తరచూ జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యం లేదని చంద్రబాబు ఎగతాళి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  మూడు రాజధానుల ఏర్పాటు నేపధ్యంలో  చంద్రబాబు మాట్లాడుతూ  రాజధాని ప్రాంత గ్రామాల్లో ఎటువంటి సెక్యురిటి లేకుండా జగన్ తిరగలేకపోతున్నట్లు ఎన్నిసార్లు ఎద్దేవా చేసింది అందరు చూసిందే. ముఖ్యమంత్రికి సెక్యురిటి అన్నది దమ్ము, ధైర్యంతో సంబంధం లేదన్న కనీస ఇంగితం కూడా చంద్రబాబులో లోపించింది.

 

దాదాపు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సెక్యురిటి ప్రోటోకాల్ గురించి తెలీకుండానే ఉంటుందా ? సిఎంలు సెక్యురిటి లేకుండా ఒంటరిగా వెళ్ళటం సినిమాల్లో  తప్ప నిజజీవితంలో జరుగుతుందా  ఎక్కడైనా ?  విషయం తెలిసి కూడా జగన్ కు దమ్ము లేదని ప్రతిరోజు గోల చేసే చంద్రబాబు తాను మాత్రం సెక్యురిటి లేకుండా బయటకు రాలేకపోతున్నారు.

 

జగన్ అధికారంలోకి రాగానే తనకు సెక్యురిటిని తగ్గించేశారంటూ ఎంత యాగీ చేశారో అందరూ చూసిందే. తాజాగా ప్రజా చైతన్య యాత్ర  మొదలుపెట్టిన చంద్రబాబు తన భద్రతను ప్రభుత్వం తగ్గించేసిందంటూ ప్రకాశం జిల్లా మార్టూరులో కూడా పెద్ద గోల చేశారు.  అంతే ప్రతిపక్షంలో ఉండి కూడా  తనకేమో ఫుల్లు సెక్యురిటి కావలా ? అదే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం ఎటువంటి సెక్యురిటి లేకుండా ఒంటరిగా రాజధాని గ్రామాల్లో తిరగాలా ?

 

అసలు చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధమవుతోందో లేదో తెలియటం లేదు. ఏదో ఓ రకంగా జగన్ పై బురద చల్లటమే ఏకైక టార్గెట్ గా పెట్టుకున్న కారణంగానే  పదే పదే టైం టేబుల్ వేసుకుని మరీ తాను ఆరోపణలు చేయటమే కాకుండా పార్టీ నేతలతో కూడా ఆరోపణలు చేయిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ నాయకత్వం ఎప్పుడైతే ఎన్టీయార్ చేతుల్లో నుండి చంద్రబాబు ఎప్పుడైతే బలవంతంగా లాగేసుకున్నారో అప్పటి నుండే భ్రష్టుపట్టడం మొదలైంది. సెక్యురిటి రచ్చతో జగన్ ఎంత ధైర్యవంతుడనే విషయాన్ని పక్కనపెడితే  చంద్రబాబు ఎంత పిరికివాడో అందరికీ అర్ధమైపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: