ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా, ఆంధ్ర పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు.. రెండు కాదు బోలెడు పేర్లు ఉన్నాయి నారా లోకేష్ బాబుకి. ఎప్పుడు ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలతో తిట్టించుకుంటాడు చిట్టినాయుడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి నారా లోకేష్ పై, చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.    

 

ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతలను కడిగి పారేసే విజయసాయి రెడ్డి ఈరోజు నారా లోకేష్ చంద్రబాబుపై కూడా దారుణంగా కామెంట్లు చేస్తూ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ముఖ్య సలహాదారుడు చిట్టినాయుడే అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ!'' అంటూ ట్విట్ చేశారు. 

 

అసలు ఎం జరిగింది అంటే.. నిన్న చిట్టి నాయుడు నారాలోకేష్ మా ఆస్తుల వివరాలు ఇవి అంటూ నిన్న గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వెల్లడించారు. ఆ ఆస్తుల ప్రకటనపైనే విజయసాయి రెడ్డి ఈరోజు సెటైరికల్ ట్విట్ చేశాడు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: