దేశంలో రోజు రోజుకీ మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నా.. ప్రభుత్వం ఇది చేస్తున్నాం...అది చేస్తున్నాం అని చెప్పడం, కామాంధులు వారి పని వారు చేసుకొని పోవడం కామన్ అయ్యింది.  ప్రతిరోజు ప్రతిరోజూ న్యూస్ ఛానల్స్ లో ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి.  దిశ, నిర్భయ, మమత, హాజీపూర్ కేసులు ఎన్ని వెలుగులోకి వచ్చినా.. ఎన్ కౌంటర్, ఉరిశిక్ష లాంటి పడుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఆడది అంటే కేవలం ఆటబొమ్మలా చూస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో దారుణ ఘటన జరిగింది. ఫిట్‌నెస్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని ట్రైనీ మహిళా సిబ్బందిని దుస్తులు విప్పించి నగ్నంగా నిలబెట్టారు.

 

అంతే కాదు వారిని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో అవమాన పరిచారు. ఈ విషయం పై  స్పందించిన మునిసిపల్‌ కమిషనర్‌ బన్‌చానిది పాణి ఈ ఘటనపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. సూరత్ మునిసిపల్ కార్పొరేషన్‌లో 100 మంది యువతులు మూడేళ్ల క్లర్క్ ఉద్యోగ శిక్షణను పూర్తిచేసుకున్నారు. ఉద్యోగం పర్మినెంట్ కావాలంటే ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకునే నేపథ్యంలో ఫిట్‌నెస్ పరీక్ష కోసం మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వరంలో నడుస్తున్న సూరత్ మునిసిపల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎస్ఎంఐఎంఈఆర్)కు వెళ్లారు.

 

అయితే గైనాకాలజిస్ట్ ఒక్కొక్కరినీ పిలిచి ఫిట్ నెస్ టెస్ట్ చేయాల్సి ఉన్నా.. పది మందిని ఒకేసారి పిలిచి దుస్తులు విప్పించి నగ్నంగా నిలబెట్టారు. పరీక్షలకు వెళ్లిన వారిలో పెళ్లికాని యువతులు కూడా ఉన్నారు.అంతే కాదు ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.  తాజాగా ఈ విషయం తెలిసిన ఉద్యోగ సంఘాలు వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహిళా సిబ్బందిపై వ్యవహరించిన తీరుపై మునిసిపల్ కమిషనర్ బన్‌చానిది పాణికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారణకు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: