చట్టానికి కళ్లు లేవు తమ్ముడు.. న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అని చిరంజీవి ఒక సినిమాలో పాడాడు.. ఇప్పుడు లోకాన్ని చూస్తుంటే ఇది నిజమనిపిస్తుంది. అవును చట్టాన్ని రక్షించవలసిన వారు తప్పులు చేస్తుంటే. న్యాయం అనాధగా మారి ఇల్లు ఇల్లు తిరుగుతుంది.. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. అంతేగాకుండా... దిశ పోలీస్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేసింది. కానీ దిశ లాంటి అమ్మాయిలకు కంచెలా ఉండవలసిన హోం గార్డు ఓ బాలికను గర్భవతి చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది...

 

 

అసలు సంగతి ఏంటో తెలుసుకుంటే మచిలీపట్నంకు చెందిన ఫణీంద్ర, దిశ పీఎస్‌లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను ప్రేమ అనే వల వేసి 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని తనివి తీరా అనుభవించాడు... ఈ క్రమంలో గత రెండు రోజులుగా బాలికకు ఆరోగ్యం బాగా లేక తరచుగా కడుపునొప్పితో బాధ పడుతుండటంతో, స్థానికంగా ఉన్న మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు.. ఆమెను పరీక్షించిన డాక్టర్స్ ఆ బాలిక గర్భంతో ఉన్నదని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. అసలు విషయం ఆరా తీయడంతో, దీనికి కారకుడు ఫణీంద్ర అని తెలిసింది..

 

 

వెంటనే అతడిని నిలదీయగా. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించ ప్రయత్నం చేశాడు. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే మచిలీపట్నంలోని చిలకలపూడి పీఎస్‌లో కంప్లయింట్ చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫణీంద్రను తమ స్టైల్లో విచారించగా, చివరకు నేరాన్ని ఒప్పుకున్నాడు.  ఇకపోతే మాయమాటలు చెప్పి ఆ బాలికను లొంగతీసుకున్న ఫణీంద్ర పై  ఫోక్సో చట్టం కింద కేసులు నమోదుచేసి, పది రోజుల్లో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఏఎస్పీ సత్తిబాబు వెల్లడించారు..

 

 

ఒక వైపు ఆడపిల్లల భద్రతకు నడుం కడుతుంటే మరో వైపు ఇలాంటి చీడపురుగులు వారి జీవితాలతో ఆడుకుంటుంటే ఇక లోకంలో ఆడపిల్లలకు భద్రతా అని ఎన్ని చట్టాలు తెచ్చిన ఉపయోగముండదు అని అనుకుంటున్నారు ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి: