గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలపై వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కామెడీగా తీసుకున్నారు. అంతకు మించి, ఇక వారు చేయగలిగేది ఏముందంటూ.. ఒకింత ధీమాని వ్యక్తం చేశారు. ఈ మేరకు అయన వరుస ట్వీట్లుతో రెచ్చిపోయారు. ఈ ప్రభుత్వానికి తనపై, టీడీపీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మరో ఉదాహరణ సిట్ ఏర్పాటు చేయడమేనని నిప్పులు చెరిగారు. 

 

తొమ్మిది నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీనే కాదు ఏకంగా ఏపీనే టార్గెట్ చేశారని, భావితరాలకు తీరని నష్టం చేశారంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించింది? అని ప్రశ్నించారు. ‘ఇప్పుడీ జీవో 344 వైసీపీ వేధింపులకు పరాకాష్ట. గత 5 ఏళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ 5ఏళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

 

‘గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనపై 26 విచారణలు చేయిస్తే ఏమైంది? ఇదీ అంతే!‘  అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా అని, టీడీపీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదని, వైసీపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బాబు స్పష్టం చేశారు. ఇంకా వీరి వైఖరి చూస్తుంటే.. వారు ఏదో మానసిక ఆందోళనలకు గురి అవుతున్నవారిలా కనిపిస్తుంది అని అన్నారు.

 

ఇంకా ఈ సందర్భంగా... చంద్రబాబు జగన్ ను ఉద్దేశించి, అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం... ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారు? ఏమి లేకపోగా... వారు ఇపుడు, తెల్లని మాయ.. మచ్చ లేని మా తెలుగు దేశం పార్టీని, కార్యకర్తలను, నాయకులను విమర్శించడం సరి కాదని బాబు వారిపైన నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: