మహిళలపై ఎక్కడ కూడా రక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రతి రోజు వార్తల్లో ముఖ్యంగా వినపడే వార్తలు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హత్యలు, ఆఘాత్యాలు రేపులు ఇలా ఆచెప్పుకుంటే మహిళను శారీరకంగా మానసికంగా చంపేస్తున్నారు. అది కూడా మన కళ్ళముందే జరుగుతున్న ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు కామాంధులకు కాలం చెల్లుతుంది. 

 


వివరాల్లోకి వెళితే.. బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన గుజరాత్‌లో కలకలంరేపింది. ఆమెకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని కుక్సీకి చెందిన మహిళ పోర్‌బందర్‌లో కూలీగా పనిచేస్తోంది.. పదిరోజుల క్రితం తన భర్తతో కలిసి సొంత ఊరికి వెళ్లింది. బుధవారం రాత్రి ఆమె ఒక్కరే తిరిగి ఒంటరిగా కుక్సీ నుంచి ప్రైవేట్ బస్సులో పోరుబందర్ బయల్దేరింది.

 


ఛోటా ఉదయపూర్ సమీపాని కి రాగానే రాత్రి 9 గంటల సమయం లో ప్రయాణికులు భోజనం చేసేందుకు బస్సును ఓ హోటల్ దగ్గర ఆపారు. ఈలోపు మహిళ తాను బస్సులో పడుకునేందుకు కాస్త స్థలం చూపించమని బస్సు డ్రైవర్, కండక్టర్‌లను అడగ్గా.. ఆమెకు మాయ మాటలు చెప్పి బస్సు పైకి తీసుకెళ్లారు.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె దానికి అంగీకరించక పోవడంతో బస్సు పై నుండి తోస్తామని బెదించారు. 

 

 


అలా ఆ మహిళపై ఆ ఇద్దరు ఈ ఘోరానికి ఒడిగట్టారు. అదే బస్సులోని కొంత దూరం వచ్చింది. అలా వచ్చిన ఆమె జరిగిన విషయాన్నీ తన మేనల్లుడికి సామాచారం అందించింది. అనంతరం అతను జరిగిన విషయాన్నీ పోలీసులు పిర్యాదు చేసాడు. పోలీసులు కేసును నమోదు చేసుకొని వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్ ను అరెస్ట్ చేసారు. బాధిత మహిళ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామని.. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: