పెళ్లి అనేది ఓ అందమైన జ్ఞాపకం.. అసలైన పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. కాని నేడు పెళ్లి అంటే తోలుబొమ్మలాటల మారింది. తాళికి విలువలేదు, మరికొందరైతే జీవితంలో సర్దుకుపోయి జీవిస్తున్నారు. కొందరు పెళ్లైన నెలలోపలే మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. మొత్తంగా నేటి కాలంలో పెళ్లీలు నవ్వులపాలవుతున్నాయి.. ఇకపోతే ఓ పెళ్లి వేడుకలో ఆ వధువు తీసుకున్న నిర్ణయం పదిమంది చేత సూపర్ అనిపించుకునేలా ఉంది.

 

 

అదేమంటే పెండ్లి వేడుక మొదలైంది! పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు వేదికపైకి వచ్చారు! సరిగ్గా అప్పుడే కథ అడ్డం తిరిగింది. ‘ఈ తాగుబోతు నాకొద్దు’ అని గట్టిగా అరుస్తూ పెండ్లి కూతురు లేచి నిలబడింది. అప్పటికే తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ వేదిక దిగి వెళ్లిపోయింది. దీంతో పీటలమీదే పెండ్లి ఆగిపోయింది. ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, మీరట్‌ నగరంలో. ఇక అసలు విషయానికి వస్తే... పీటలమీద కూర్చున్న పెండ్లి కొడుకు నోటి నుంచి గుప్పుమని మద్యం వాసన రావడంతో పెండ్లి కూతురు హతాశురాలైంది.

 

 

సరిగా కూర్చోలేక జోగుతున్న పెండ్లి కొడుకు వాలకం చూసి ఆమెకు ఒళ్లు మండిపోయింది. అందుకే కోపంతో పీటల మీది నుంచి ఈ పెళ్లి చేసుకుని జీవితాంతం వీడితో బాధపడలేను అని లేచి వెళ్లిపోయింది.. ఇదే కాకుండా పెండ్లి కొడుకు తల్లి, తండ్రి కూడా పూటుగా మద్యం తాగి, పెండ్లి కూతురు కుటుంబసభ్యులను ఓ గదిలో నిర్బంధించారట. పెండ్లి జరుగకుండా ఎవ్వరినీ ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదంటూ బెదిరింపులు చేస్తూ, నానా హంగామా చేశారట.

 

 

అయితే, ఈ విషయం ఎవరో పోలీసుల చెవిన వేయగా, వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పెండ్లికూతురు కుటుంబం ఫిర్యాదు మేరకు.. పెండ్లి కొడుకును, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారట.. ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో మీరే చెప్పండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: