ఛీ.. కాలం ఎలా అయ్యింది అంటే? దారుణంగా మారిపోయింది.. మేము రాస్తూనే ఉన్నాం ఆడపిల్లలపై అఘాయిత్యాలు.. అఘాయిత్యాలు అని.. కానీ అక్కడ జరిగింది ఏమి లేదు.. ఆడది అంటే కనీస గౌరవం లేదు.. ఈ కాలం మృగాళ్లకు.. కనిపిస్తే చాలు అత్యాచారాలు చేస్తున్నారు.. అది కూడా సామూహిక అత్యాచారాలు చేస్తున్నారు. 

 

ఇకపోతే ఈ నేపథ్యంలోనే ఓ దారుణమైన ఘటన.. వింటేనే ఏడుపు వచ్చే ఘటన.. చూస్తే అయ్యో ఎంత దారుణం అని అనిపించే ఘటన బెంగుళూరులో జరిగింది.. చిన్న పాప అండి.. 16 ఏళ్ళు అంతే.. ఆ పిల్లను గ్యాంగ్ రేప్ చేశారు..  గత సంవత్సరం నవంబర్ నెలలో ఆ పిల్ల యజమాని ఇంట్లో చెత్త ఊడుస్తూ ప్రసవం అయ్యింది. 

 

ఇంత దారుణమైన ఘటనను చూశారా ? చిన్నపిల్ల ఆ అమ్మాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఆ అమ్మయిపై ఎవరు రేప్ చేశారు అని ఆ అమ్మాయిని విచారించగా  తనపై 2019 ప్రారంభంలో సామూహిక అత్యాచారం జరిగిందని ఆ అమ్మాయి వాపోయింది. యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి నవంబర్ నెలలో ఇల్లు ఊడుస్తూ అకస్మాత్తుగా రక్తమడుగులో కనిపించింది అని.. ఆమెకు అక్కడే ప్రసవం జరిగింది అని.. అయితే ఆమెను.. ఆమె బిడ్డను వెంటనే ఆస్పత్రికి తరలించాం అని తెలిపారు. 

 

అనంతరం.. ఆ విషయాన్నీ జిల్లా శిశు సంక్షేమ కమిటీకి తెలియచేశారు. కాగా వారు ఒడిశాలో ఉంటారు అని.. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది అని.. ఆ తర్వాత అక్కడ నుండి బెంగుళూరుకు వచ్చానని.. తన బంధువులతో కలిసి ఉంటున్నట్టు.. ఆమె బంధువులు కూడా ఇళ్లలో పని చేస్తూ ఉంటారు అని ఆ 16 ఏళ్ళ బాలిక చెప్పింది. సమాచారం తెలుసుకున్న సిడబ్ల్యూసీ బాలికను, ఆమె బిడ్డను ఎన్జీవోకు అప్పగించారు. 

 

అనంతరం ఆ ఎన్జీవో ఆమెను.. ఆమె బిడ్డను బాలిక తల్లిదండ్రులకు అప్పగించారు.. అయితే ఆ అమ్మాయికి మంచి ఆహారం దొరకడం వల్ల ఆమె లావు అవుతుంది అని అనుకున్నాం కానీ గర్భవతి అని తెలీదు అని అంటున్నారు ఆమెను పనిలో పెట్టుకున్న యజమానులు. కాగా మైనర్ బాలికను పనిలో పెట్టుకున్నందుకు ఆ దంపతులకు కూడా చిక్కులు తప్పడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: