మూడు ముళ్ళు వేసి... ఏడు అడుగులు నడిచి... నాతిచరామి అంటూ ప్రమాణం చేసిన తర్వాత... భర్త ఎప్పుడూ భార్యకు తోడుగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా భర్త ముందుండి ఆ సమస్యను పరిష్కరించాలి. భార్యకు తోడు నీడలా ఉంటూ రక్షణ కల్పించాలి. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం భార్యకు సమస్య గా మారిపోయాడు. భార్యను సంతోషంగా చూసుకోవడం వదిలేసి ప్రతిరోజు వేధించడం మొదలుపెట్టాడు.భార్యపై తన పైశాచికత్వాన్ని చూపించాడు. తన కట్టుకున్న భార్యనే నలుగురిలో నవ్వుల పాలు చేశాడు. ఏకంగా భార్యను వివస్త్రను చేసి రోడ్డుపైకి గెంటేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 


 వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా భిక్కనూరు లో ఉండే ఇద్దరు భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. భర్త ప్రతిరోజు భార్యతో అనవసరంగా గొడవలు పడుతూ అతి దారుణంగా చితక బాదేశాడు. అయినప్పటికీ భార్య భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటిక సహిస్తూనే  వచ్చింది. ఎన్నిసార్లు చితకబాదిన భరిస్తూనే వచ్చింది. ఎన్ని వేధింపులు  పెట్టిన ఓపిక పడుతూనే వచ్చింది. కానీ రోజురోజుకు భర్త పైశాచికత్వం పెరిగిపోతుంది. ఇక ఇదే క్రమంలో ఓ రోజు భర్త భార్యతో గొడవ పడ్డాడు భర్త. ఇక మాటా మాటా పెరగడంతో చేయి చేసుకున్నాడు సదరు భర్త. 

 


 భార్య కు రక్షణగా నిలుస్తూ ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడు అంటే... అప్పటికే భార్య ను చితకబాదిన భర్త  తన భార్యను వివస్త్రను చేసి ఒంటి మీద కనీసం బట్టలు లేకుండా... రోడ్డుమీదికి నెట్టేశాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వాళ్ళు షాక్ కి గురయ్యారు. ఇక బంధువులు పరిచయస్తులు ఆమెకు దుస్తులు  అందించగా ఆ దుస్తులను వేసుకుంది  ఆ మహిళ. నలుగురిలో తీవ్ర అవమానాల పాలు కావడంతో ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భర్త పైశాచికత్వం పై ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: