రోజురోజుకూ మహిళలపై దారుణాలు ఎక్కువైపోతున్నాయి. అసలు మహిళలపై దారుణాలు అనడం కంటే మనుషులే దారుణంగా మారారు అనడం ఉత్తమం.. ఎందుకంటే తాను చేసేపని సరైంది కాదని తెలిసి కూడా, చట్టం, సమాజం అంటే భయం లేకుండా అహాంకారంతో నీచానికి దిగజారుతున్నారు.. ఇదిగో వీడొక కట్టుకున్న భర్త.. ఆవిడ ఇతని భార్య అన్న ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం తానొక ఆడది అనే మానవత్వం లేకుండా కౄరమృగం వలే ప్రవర్తించిన తీరు మానవ జాతికే కళంకం..

 

 

స్దానికంగా ఓ భర్త తన భార్యపై పైశాచికంగా ప్రవర్తించిన తీరు సంచలనం రేపింది. అదేమంటే అనుమానంతో భార్యను చితకబాదిన ఆ ప్రబుద్ధుడు.. ఆమెను వివస్రను చేసి రోడ్డుపైకి గెంటేశాడు. ఇదే కాకుండా మొన్నటికి మొన్న ఓ బుద్ధిహీనుడు తన భార్య పై అనుమానంతో భార్య జననాంగాలను గమ్ తో మూసేశాడు, మరొకడు తన భార్య అవయవాలకు తాళం వేసాడు... ఇంకొకడు ఇంట్లో పెళ్లాన్ని పెట్టి తాళం వేసి ఆఫీసుకు వెళ్లాడు.. ఇలా చెప్పుకుంటు వెళ్లితే చాలా సంఘటనలు ఉన్నాయి..

 

 

ఆడది తప్పుచేయాలంటే ఎలాగైన చేస్తుంది. ఎన్ని తాళాలతో మూసిన తాను చెడిపోవాలనుకుంటే మగవాడు ఎంత.. ఇక్కడ కావలసింది నమ్మకం మాత్రమే.. ఇకపోతే ఇలాంటి నేరాలు జరిగినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయడం.. నిందితులను జైలులో పెట్టి మూడుపూటలా తిండి పెట్టడం..ఇది షరా మామూలే గానీ..దిశ కేసు విషయంలో జరిగినట్లే అన్ని కేసుల్లోనూ నేరం చేసిన ప్రతి నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తేనన్న..ఆడపిల్లను తాకాలంటేనే భయం పుడుతుందని అంటున్నారు కొందరు.

 

 

నిర్భయ కేసు విషయంలో అయితే.. నిందితులకు ఇప్పటికీ నాలుగుసార్లు ఉరిశిక్ష విధించేందుకు ఢిల్లీ పటియాలా కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ.. ఏదొక సాకు చెబుతూ, శిక్షనుండి తప్పించుకుంటున్నారు.. మన చట్టంలో ఉన్న కొన్ని కొన్ని లోపాలు ఇప్పుడు నేరస్ధుల పాలిట లొసుగులుగా మారాయి.. అందుకే మానవ మృగాలు ఇలా రెచ్చిపోతున్నాయి అని కొందరు అనుకుంటున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: