రోజు రోజుకు అక్రమ సంబంధాలు జీవితాలను బలి తీసుకుంటున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఓ అయిదు నిమిషాల సుఖం కోసం కుటుంబంలోని అందరి జీవితాలను నాశనం చేస్తున్నారు. వారి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ ప్రియుడి సాయంతో భర్తను చంపి దహనం చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయి మలాడ్ ప్రాంతంలో వెలుగుచూసింది.

 

 

వివరాల్లోకి వెళ్ళితే... మహేశ్‌ పటేల్ అనే వ్యక్తి భార్య ఉజ్జవాలాతో కలిసి మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే.. అదే ప్రాంతానికి చెందిన అరుప్ అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని ఆమె రాసలీలలు కొనసాగించేంది. ఈ విషయం తెలుసుకున్న భర్త మహేశ్‌ భార్యను నిలదీశాడు. పద్ధతి మార్చుకోకపోతే ప్రాణం తీస్తానని హెచ్చరించాడు. దీంతో తన సుఖాలకు అడ్డుపడుతున్న భర్తను చంపేయాలని ఉజ్జవాలా నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పి భర్త మరణానికి ప్లాన్ వేసింది.

 

 

కాగా., ఉజ్జవాల ప్రియుడు ఆరుప్ దక్షిణ ముంబయిలోని ఓ ఆస్పత్రి క్యాంటీన్‌ లో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు సాగర్ శర్మ సాయంతో పాయిజన్ లాంటి మందులను సేకరించి ప్రియురాలయిన ఉజ్జావాలా కు ఇచ్చాడు. ఆమె భర్త తినే ఆహారంలో ఆ మందును కలిపింది. దాన్ని తిన్న మహేశ్‌కు ఏమీ కాకపోవడంతో నిద్రపోతున్న సమయంలో ప్రియుడిని రప్పించి దిండుతో అతడి ముఖానికి అదిమి ఊపిరాడకుండా చంపేసింది. ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయాడని నకిలీ సర్టిఫికెట్ సంపాదించి అందరినీ నమ్మించి దహన సంస్కారాలు పూర్తి చేసింది.

 

 

భర్త అడ్డు తొలగడంతో హద్దు అదుపు లేకుండా పోయింది. ప్రియుడిని  ఇంటికి పిలిపించి.. రాసలీలలు కొనసాగించింది. ఇంకా ఆమెను ఎవ్వరూ ఆపేవాల్లు లేకపోవటంతో ఇంటికి తెచ్చిపెట్టుకుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. మహేశ్ గుండెపోటుతో చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్‌ను విచారించగా సాగర్ శర్మ, అరుఫ్ అలా ఇవ్వమన్నట్లు చెప్పాడు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఉజ్జవాలా బాగోతం బయటపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: