ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఎంత వేడిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి వేడి వేడి రాజకీయాలకు అగ్గికి ఆజ్యం పోసినట్టు కొన్ని పత్రికలు ఆ రాజకీయాలను ఇంకా రెచ్చగొడుతుంటాయి.. కార్యకర్తలలో గొడవలు పెట్టడమే కాకుండా.. రాజకీయ నేతలను.. ప్రజలను రెచ్చగొడుతుంటాయి. అందుకే అలాంటి వారిపై.. అలా చూపించే వారిపై విజయసాయి రెడ్డి ఎప్పటికప్పుడు విరుచుకుపడుతుంటారు.  

 

వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబుపై.. ఓ మీడియాపై సెటైర్లు వేశాడు. ఎంతైనా ఎంగిలి కుడు తిన్న విశ్వాసం కదా అంటూ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది. ఎంగిలి కూడు తిన్న విశ్వాసం కదా! యజమాని, బానిసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరో ఏడాదిలో ఇక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తాయి. సిఎం జగన్ గారి పాలనలో ఏపీ రోల్ మోడల్ అవుతుంది.'' అంటూ ట్విట్ చేశారు.

 

ఈ ట్విట్ చుసిన నెటిజన్లు ''ఎల్లో మీడియాకు జనం ఎప్పుడో.. ఇక చాలు మీ సేవలు అని దణ్ణం పెట్టేసారు.. పచ్చ పిచోళ్లు మతులు పోయి నిద్రమాత్రలతో బ్రతుకుతున్నారు.. ప్రతి నాటకాన్ని.. ప్రజలు చూస్తున్నారు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఇంటికి వస్తే.. కాలర్ పట్టుకుని అడుగుతారు సార్ ప్రజలు'' అంటూ ట్విట్లు చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: