ఎవరితో అయినా పెట్టుకోండి.. దేవుడితో పెట్టుకుంటే ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించాల్సిందే.. దేవుడు అంత పవర్ ఫుల్ మరి. అది నిజం అని ఈ ఘటన చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జియాగూడకు చెందిన దేవేందర్ అనే వ్యక్తి మూడేళ్ల కిందట ముంబై పర్యటనకు వెళ్ళాడు. 

 

అలా వెళ్లిన దేవేందర్... ముంబైలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుండి అరుదైన నాగమణి స్టోన్‌ను కొనుగోలు చేశాడు. అయితే కొన్ని నెలలకు ముందు దేవేందర్ కు కూకట్ పల్లికి చెందిన జాన్.. కాకినాడకు చెందిన దుర్గ ప్రసాద్ పరిచయమయ్యాడు.. అయితే వంట పనుల నిమిత్తం జియాగూడకు వచ్చే వీరితో దేవేందర్ పరిచయం పెంచుకున్నాడు. 

 

ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది.. దీంతో దేవేందర్.. అతని వద్ద ఉన్న నాగమణి రాయిని జాన్, దుర్గ ప్రసాద్ కు చూపించగా అది అత్యంత విశిష్టమైనడి అని ఆ వంట వాళ్ళు అతడితో చెప్పారు... అంతేకాదు.. పంచలోహాలు కలిసిన అమ్మవారి విగ్రహంతో పూజలు చేస్తే వ్యాపారంలో కోట్ల రూపాయిలు కలిసి వస్తాయి అని.. ఎంతమంది పెద్ద పెద్ద వ్యాపారాలు ఇలాగే పూజలు చేస్తారు అని.. ఆ వంటవాళ్లు ఇద్దరు దేవేందర్ కు వివరించారు. 

 

వారు అక్కడితో ఆగలేదు.. వారి వద్ద పంచలోహ దుర్గా మాత విగ్రహం ఉందని, రెండింటినీ కలిపి రూ.కోటికి విక్రయిస్తే అందరు కలిసి ఆ డబ్బుని పంచుకోవచ్చని ఆ వంటవాళ్లు చెప్పారు. దీంతో దేవేందర్ ఆ మాటలకూ సరే అని చెప్పాడు. వారితో పాటు మొహమ్మద్ ఆష్రాఫ్, ప్రేమ్ చంద్ అనే మరో ఇద్దరు నిందితులను కలుపుకొని విగ్రహాల అమ్మడానికి సిద్ధం అయ్యరు. 

 

అయితే అక్కడే వారి బండారం బయట పడింది.. ఈరోజు జియాగూడలో పంచలోహ విగ్రహం, నాగమణి ప్రతిమను అమ్మడం కోసం ప్రయత్నాలు చేసే సమయంలో వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి విగ్రహాలను, మూడు సెల్ ఫోన్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా విగ్రహాలను అక్రమంగా అమ్మాలి అనుకున్నారు చివరికి బుక్ అయ్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: