సమయం దొరికితే చాలు.. చంద్రబాబుని ఏకిపారేస్తుంటారు విజయసాయి రెడ్డి.. అలానే ఈరోజు ఉదయం నుండి సాయింత్రం వరుకు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. మొదట ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలాడు ఈ చంద్రబాబు అంటూ విరుచుకుపడిన విజయసాయి రెడ్డి.. 

 

ఆతర్వాత ట్విట్ చేస్తూ.. ''అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా 40 ఏళ్ల అనుభవం అంటే? ప్రజలు అధికార పీఠం నుంచి విసిరి కొట్టినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర పన్నడం తప్ప రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశావా? ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి.'' అంటూ తిట్టిపారేశారు.   

 

అంతేకాదు... ఆతర్వాత కూడా మరో ట్విట్ చేసి చంద్రబాబుకు అతని మీడియాకు చమటలు పట్టించేసారు. ఆ ట్విట్ ఎం అని పెట్టారు అంటే? బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది... ఎందుకంటే ఎంగిలి కుడు తినింది కదా.. ఆ విశ్వాసం అంటూ ఆగ్రహించారు.. అంతేకాదు.. వారికీ వార్నింగ్ కూడా ఇచ్చారు.. యజమాని, బానిసలు ఒకటి గుర్తుపెట్టుకోండి.. మరో ఏడాదిలో ఇక్క అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయి.. సీఎం జగన్ గారి పాలనలో ఏపీ రోల్ మోడల్ అవుతుంది'' అంటూ ట్విట్ చేశారు సాయి రెడ్డి. 

 

దీంతో ఈ ట్విట్లపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి.. కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతే.. మరికొందరు నెగటివ్ గా రియాక్ట్ అయ్యారు.. దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: