మామూలుగా అందరికీ దండుపాళ్యం సినిమా గురించి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో ఓ గ్యాంగ్  దొంగతనాలకు పాల్పడుతూ ఉంటే.. చూస్తూ నోరెళ్లబెట్టాల్సిందే. అయితే ఇలాంటి గ్యాంగులే  ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. కేవలం దండుపాళ్యం సినిమా లో కాదు అంతకు మించి అనేలా  పక్కా ప్లాన్తో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి గ్యాంగ్  ఒకటి  దొంగతనానికి పాల్పడింది. చికిత్స కోసం అని వైద్యులు ఇంటి తలుపులు తట్టారు దుండగులు. తలుపులు తెరవగానే లోపలికి చొరబడి... దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. దొడ్డబళ్ళాపురం మాగడి తాలూకా కుదురులో  ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో... అపరిచితులు డాక్టర్ సుభాష్ సింగ్ ఇంటి తలుపులు తట్టారు. ఓ మహిళ చిన్న పాప ని ఎత్తుకుని వచ్చి పాపకు ఆరోగ్యం బాగాలేదని మందులు ఇవ్వాలి అంటూ డాక్టర్ ను కోరింది. ఇక మందులు ఇచ్చేందుకు ఆ మహిళను లోపలికి రమ్మన్నాడు డాక్టర్. ఇంతలో ఆ మహిళ వెంటనే 15 మంది ఇంట్లోకి చొరబడ్డారు.ఇక వచ్చీరాగానే డాక్టర్ సుభాష్ సింగ్  తోపాటు భార్య కుమారుల కళ్లల్లో  కూడా కారం చల్లారు.ఇక ఆ తర్వాత వాళ్లు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు చేతులు కట్టేసి... బంగారు వెండి నగదు ఖరీదైన వస్తువులన్నింటిని దోచుకెళ్లారు. అంతేకాదు కారును కూడా దోచుకెళ్లారు. 

 

 

 ఈ క్రమంలోనే ప్రతిఘటించిన కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు దుండగులు. అయితే ఇంటి చుట్టూ 14 సీసీటీవీ కెమెరాలు ఉన్న 15 పెంపుడు కుక్కలు ఉన్నప్పటికీ... ఎవరికీ అనుమానం రాకుండా నిర్భయంగా దోపిడీ చేసుకుపోయారు దుండగులు. ఇక తమ చిత్రాల దొరక్కుండా ఏకంగా సీసీటీవీల ఉపకరణాలను కూడా అపహరించారు అంటే అంతా పక్కా ప్లాన్ తో వచ్చారు అర్థం చేసుకోవచ్చు. వైద్యుని కుమారుడు అతికష్టంమీద కట్లు తెంచుకుని బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని రక్షించారు. తీవ్ర గాయాలపాలైన వాళ్ళని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: