విజయసాయి రెడ్డి... ఎప్పుడు ఏదో ఒక విషయంపై ప్రతిపక్షంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ ఉంటారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన‌ విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు వారు చేసే ఆరోపణలపై ఫైర్ అయ్యే విజయ సాయి రెడ్డి ఈరోజు కూడా తనదైన శైలిలో ట్విట్టర్ వేదిక‌గా ఫైర్ అయ్యారు. 

 

ఈ నేపథ్యంలోనే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకోవద్దట. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. నువ్వు నెలనెలా బిచ్చమేస్తేనే ప్రజలు బతుకుతున్నారనుకుంటున్నావా బాబూ? ఎవడబ్బ సొమ్మని ఫ్లెక్సీలు కడతారని చించుకుంటున్నావు. 14 ఏళ్లు సిఎంగా చేసినోడివి ఇంతగా పతనమవుతావని అనుకోలేదు.'' అంటూ అయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

 

వైసీపీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవడంపై అభ్యంతరం తెలిపిన చంద్రబాబుపై విమర్శలు చేశారు. అయితే ఈ ట్విట్ చుసిన నెటిజన్లు కూడా.. ''ఎవరి అభిమానం వారిది... వారి ఇష్ట ప్రకారమే ఫ్లెక్సీలు కట్టుకుంటున్నారు.. మీకు ఏంటి సమస్య? అంటూ ట్విట్ చేసి దుమ్ము దులుపుతున్నారు నెటిజన్లు. మరికొందరు ట్విట్ చేస్తూ.. నీ సమస్య ఏంటి? నీకు ఎవరు ఫ్లెక్సీలు కట్టలేదా బాబు.. ఎందుకు నీకు 70 ఏళ్ళ వయసులో కూడా ఇంత కుళ్ళు'' అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: