దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతగా తగ్గించాలని చూసినా తగ్గడం లేదు. ఐదేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల బామ్మ వరకు ఎవరిని కామాంధులు వదలడం లేదు. ప్రలోభపెట్టి, భయపెట్టి రేపులు చేస్తున్నారు. ప్రస్తుతం చట్టాలు కఠినంగా ఉన్నాయని తెలుసు. కానీ, ఆ చట్టాలను లక్ష్యపెట్టకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎంతగా రెచ్చిపోతున్నారు అంటే, అమ్మాయి కనిపిస్తే చాలు కోరికలు దారుణంగా పుట్టుకొస్తున్నాయి.
చుట్టుపక్కల ఉండే బంధువుల పిల్లలను కూడా వదలడం లేదు. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజపురం లో ఓ కుటుంబం రోజువారీ పనులకు వెళ్తుంటారు. స్కూల్ లో చదువుకునే 11 ఏళ్ల చిన్నారి ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లి ఇంటికి వస్తుంటుంది. ఇంటికి వచ్చి తల్లిదండ్రులు వచ్చే వరకు ఒంటరిగా ఉండేది. అలాంటి చిన్నారిపై 30 ఏళ్ల సమీప బంధువు ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఇంటికి వచ్చాడు. అలా వచ్చిన ఆ యువకుడు చిన్నారిని మాటలలో పెట్టి పలకరించారు. ఆ తరువాత యువకుడు భయపెట్టి అత్యాచారం చేశాడు. ఎవరితోనైనా చెప్తే చంపేస్తానని చెప్పడంతో పాపం ఆ బాలిక ఎవరితో చెప్పలేదు. ఆ తరువాత ఆ యువకుడు తరచుగా ఆ అమ్మాయితో మాట్లాడుతుండేవాడు.
ఫోనులో అమ్మాయి మాట్లాడటం చూసిన బాలిక తండ్రి ఆరాతీయగా అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికను వైద్యపరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు. కాగా, అత్యాచారం చేసిన యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. కామాంధుడిని ఉరిశిక్ష విధించాలని తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.