ఎప్పుడైనా ఒక ట్విట్ కి ఎవరైనా బయపడుతారు అంటే అది ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ప్రతి పక్ష నాయకులూ అనే చెప్పాలి. ఎందుకంటే అయన ట్విట్లు అంత ఘాటుగా ఉంటాయి. ఇక పోతే వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అయినా విజయసాయి రెడ్డి చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

 

గత చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని వెలికితీసే పనిలో ఉన్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే సీట్ పేరుతో ఎన్నో ఎంక్వయిరీలు చేసి ప్రతిపక్ష నేతలకు చమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే అయితే అవి ఎప్పుడు బయపడుతాయో తెలియదు కానీ.. గత ఐదేళ్లలో పిలిచిన టెండర్లకు రివర్స్ టెండర్ల పేరుతో ఇప్పటి వరకు 2 వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై తాజాగా విజయ సాయి రెడ్డి ట్విట్ చేశారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''సీఎం జగన్ గారు నాలుగు నెలల్లోనే రివర్స్ టెండర్ విధానంలో రూ.2000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. నువ్వు అధికారంలో ఉంటే 15% ఎక్సెస్ లు, నామినేషన్లతో పనులు కట్టబెట్టి రూ.15 వేల కోట్లు దోచుకునేవాడివి. పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా నీది. ఎవరేంటో ప్రజలకు తెలిసిపోయింది.'' అంటూ సెటైర్ వేశారు విజయసాయి రెడ్డి.   

 

చంద్రబాబు నీ పరిపాలన అంటే లూటీ చేయడమే అన్న ఫిలాసఫీ కదా నీది అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సెటైర్ వేశారు విజయసాయి రెడ్డి. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా ఈ ట్విట్ ను చూసి తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: