ఈ రోజుల్లో ఆడపిల్లలను కనాలంటేనే చాలా భయంగా ఉంది తల్లిదండ్రులకి వారు పెరిగి పెద్దయ్యే వరకు ఒక సమస్య అయితే పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేసి పంపాక మరొక సమస్య కనపడుతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఎక్కడ ఇబ్బంది పడుతుందో చేసుకున్నవాడు ఎలాంటి వాడో అని తల్లిదండ్రులు ఆడపిల్లకు పెళ్ళి చేసిన దగ్గర నుంచి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందులోనూ నేటి యువత చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని చావడానికి కూడా వెనకాడడం లేదు. తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు తర్వాత జీవితం వీటన్నిటి గురించి ఆలోచించే కనీస పరిస్థితుల్లో కూడా ఉండడం లేదు. క్షణికావేశంలో వారు ఏ నిర్ణయం తీసుకున్నారో అదే సరైనదని భావించి వారి నూరేళ్ళ జీవితాన్ని మధ్యలనే అంతం చేసేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో హరిహరపురం కాలనీలో నివాసముంటున్న రాఘవేందర్ అనే ఓ యువకుడు మెడికల్ రిప్రజెంట్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అతడికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన సౌమ్యతో వివాహం జరిగింది. కొద్దిరోజులు వీరిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. సాఫీగానే సాగిన వీరి సంసారంలో సడెన్గా కలహాలు రావడం మొదలయ్యాయి. సౌమ్యను అత్తమామలు ఏదో ఒక విషయంలో వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పుకునేది కానీ అతడూ పట్టించుకోకుండా పైగా అతడు కూడా ఏవో ఒకటి సూటిపోటి మాటలతో భార్యను ఇబ్బంది పెట్టేవాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన సౌమ్య బాత్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకుని చనిపోయింది.
బుధవారం ఉదయం దంపతుల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సౌమ్య బాత్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భర్త తోసుకుని లోనికి వెళ్లగా సౌమ్య ఉరేసుకుని కనిపించింది. దాంతో ఆమె చనిపోయిందని నిర్ధారించుకోగానే రాఘవేందర్ కూడా బెడ్రూమ్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు చూసి సకాలంలో స్పందించి అతడిని రక్షించి హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అత్తమామలు, భర్త వేధింపులు తట్టుకోలేక సౌమ్య ఇలాంటి పని చేసిందంటూ సౌమ్య తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.