ఈ మధ్యకాలంలో సైకో కిల్లర్లు ఎక్కువ అయిపోతున్నారు.. భర్త రూపంలో.. ప్రియుడు రూపంలో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నారు ఈ సైకో కిల్లర్లు.. ఇక అలాంటి ఓ వ్యక్తి చేసిన సైకో పనే ఈ 300 ముక్కలు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్ లో ఓ రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ 2013లో తన భార్యను అత్యంత దారుణంగా హత్యచేశాడు.            

 

ఆమె శరీరాన్ని దాదాపు 300 ముక్కలుపైగా నరికాడు.. ఈ ఘటన భువనేశ్వర్‌లో జరిగింది. 2013లో జరిగిన ఈ హత్యకు సంబంధించి దాదాపు ఆరేళ్ల తర్వాత జిల్లా సెషన్స్ కోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటి అంటే? అతనికి జీవితఖైదు విధించింది. 2013లో సోమనాథ్ పరిదా అనే 78 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. 

 

అయితే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి అతనికి జీవిత ఖైదు విధించింది. ఖుర్దా జిల్లా సెషన్స్ కోర్టు లోక్‌నాథ్ మహోపాత్ర నిందితుడైన ఆర్మీ డాక్టర్‌కు శిక్ష ఖరారు చేసినట్లు సమాచారం. అయితే నిందితుడు చేసిన హత్యను ఎవరు ప్రత్యేక్షంగా చూడకపోవడంతో.. అక్కడి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వాటినే ఆధారంగా చేసుకుని నిందితుడుకు శిక్ష విధించారు.          

 

అయితే 2013 జూన్ 3న తన 62 ఏళ్ల భార్యను హత్యచేసి శరీరంను ముక్కలు ముక్కలుగా కోశాడని లాయర్ వెల్లడించారు. జూన్ 21న సోమనాథ్‌ను నయాపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్య జరిగిన 15 రోజులకు ఈ విషయం వెలుగు చూసిందని లాయర్ చెప్పారు. రెండు డబ్బాల్లో భార్య మృతదేహం ముక్కలు చేసి పెట్టాడు.             

మరింత సమాచారం తెలుసుకోండి: