ఆడవాళ్లపై మగవాళ్ల ఆకృత్యాలకు అంతులేకుండా పోతుంది. అడపిల్లలను చూస్తే ఆటబోమ్మలా ఆడుకుంటున్నారు. నేటి సమాజంలో ఎక్కడా చూసిన ఎటూ చూసిన అమ్మాయిలపైన జరుగుతున్న అరాచకాలే కనిపిస్తున్నాయి. అసలు వారి పట్ల గౌరవం పోయి విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కామంధులు చేసే ఆత్యాచారాలు, అఘాయిత్యాలు, ఒళ్లు గగ్గురు పోడిచే హత్యలు, మహిళలపై అక్రమ రవాణా ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటాము. ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసిన దేశంలో ఏదో ఒక మూలాన ఇలాంటి ఘటనలు బయటకు వస్తున్నాయి.
ఎన్ని సెక్షన్లు మారిన.. శిక్షలు పెరిగిన.. ఆగని కామదాహం.. ఆడది అయితే చాలు చిన్న,పెద్ద తేడా లేకుండా ఆత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని శిక్షలు మారిన కామాంధులు కామ దాహం మాత్రం ఎక్కడా ఆగలేదు. ఒకవైపు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తున్నా కుడా వణుకు జనుకు లేకుండా తాజాగా మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కేవలం రెండు గంటల్లో 19 ఏళ్ల ఓ యువతిపై వేర్వేరుగా సాగిన రెండు ఘటనల్లో ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన దారుణ ఉదంతం మహారాష్ట్రలోని నవీ ముంబై నగరంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఘట్కోపర్ రైల్వేస్టేషను వద్ద 19 ఏళ్ల ఓ యువతి తన బంధువులతో కలిసి సబర్బన్ రైలు ఎక్కలేక పోయింది. అయితే ఒక రైలు బదులు మరో రైలు ఎక్కిన యువతి రాత్రికి థానేలోని ముంబ్రా రైల్వేస్టేషనుకు వచ్చి అక్కడే నిద్రపోయింది. ఆ తర్వాత సదరు యువతి ముంబ్రా నుంచి మరో రైలు ఎక్కి దివా రైల్వేస్టేషనులో దిగింది. అయితే దివా రైల్వేస్టేషనులో దిగిన యువతి దగ్గర ఇంటికి వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో తన ముక్కు పుడకను విక్రయించేందుకు సిద్ధం అయింది.
అయితే రాత్రి వరకు యత్నించినా ముక్కుపుడక విక్రయించలేక స్టేషను బయటకు వచ్చింది సదరు యువతి. ఇక తిరిగి రైల్వేస్టేషనుకు వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కగా, ఆ ఆటో డ్రైవరు ఆమెను నవీముంబైలోని ఓ నిర్మానుష్య భవనంలోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసి దేవాలయం వద్ద వదిలి వెళ్లిపోయాడు. అయితే అనంతరం మరో ఇద్దరు స్కూటరిస్టులు ఆమెను రైల్వేస్టేషనుకు తీసుకువెళతామని చెప్పి ఘన్సోలీ ప్రాంతానికి తీసుకువెళ్లి మళ్లీ ఆమెపై ఇద్దరు అత్యాచారం చేసి అక్కడ నుంచి పరారయ్యారు. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నామోదు సదరు ముగ్గురు కామాంధులను అరెస్టు చేశారు.