పెళ్ళైన కొత్తలో భార్య భర్తల మధ్య చిర్రు బుర్రూలు, సరసాలు, సరదాలు ఉండటం కొత్తేమీకాదు. పెళ్ళైన కొత్తలో కాబట్టి ఇలాంటి ముచ్చట్లు కామన్. అయితే, కొద్దిరోజులు అయినా తర్వాత ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం కామన్. వాటిని సర్దుకుపోయి మసలుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అలా కాకుండా కాలు రువ్వితే మాత్రం పెద్ద ప్రమాదం. 

 


అయితే, పిల్లలు పుట్టాక వారి బంధం ఇంకాస్త బలపడటమే కాకుండా ఇంకాస్త భాద్యతలు కూడా పెడుతూండటం చూస్తూనే ఉంటాము. ఆ క్రమంలో ఎన్నో పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి. వృద్ధాప్యం వచ్చాక బిడ్డలు చూడక పోతే భార్యకు భర్త భర్తకు భార్య తోడు నీడగా ఉండాల్సింది పోయి ఓ 72 ఏళ్ల వృద్ధుడు భార్యను హింసలకు గురిచేస్తున్నాడు. 

 


వివరాల్లోకి వెళితే... 72 ఏళ్ల వయస్సులో కూడా భార్యను చిత్ర హింసలకు గురిచేసిన ఘటన హైదరాబాద్ రాంనగర్‌లో చోటుచేసుకుంది. గంగాధర్ అనే వ్యక్తి గత 8 నెలలుగా భార్య బేబీని ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ముషీరాబాద్‌లోని గణేష్ నగర్‌లో ఈ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం గంగాధర్.. భార్యను ఇంట్లో ఉంచి తాళం వేసి పరారయ్యాడు. అయితే ఇంట్లోంచి కేకలు వినిపించడంతో.. అక్కడి చేరుకొని భర్తకు ఫోన్ చేసారు. 

 


కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో,ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు తాళాలు బద్దలకొట్టి.. బేబీని బంధ విముక్తురాలిని చేశారు. కాగా.. కృష్ణా జిల్లాలో గంగాధర్ వీఆర్వోగా పనిచేసేవాడని తెలిసింది. అయితే ఇంత లేటు వయసులో కూడా తన భార్యను చిత్ర హింసలు పెట్టిన ఈ శాడిస్ట్ భర్త వైనం స్థానికులను షాక్‌కి గురిచేసింది. కాగా అతని దుర్మార్గంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: