విశాఖపట్నం నుండి జనాలు చంద్రబాబునాయుడును తరిమికొట్టినట్లుగానే పార్టీ నుండి నేతలు, కార్యకర్తలందరూ కలిసి బయటకు తిరిమి కొట్టాలంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయం దగ్గర గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకూ జరిగిన హై ఓల్టేజ్ డ్రామా అందరూ చూసిందే.  విశాఖపట్నాన్ని చంద్రబాబు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఒకవైపు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు జనాలందరినీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం విశాఖపట్నంకు వచ్చారు. దాంతో ఒళ్ళు మండిపోయిన వైసిపి కార్యకర్తలు, స్ధానిక జనాలు ఎయిర్ పోర్టు నుండి చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దాంతో దాదాపు ఆరుగంటల పాటు పెద్ద డ్రామా నడిచింది. చివరకు పోలీసుల ఒత్తిడికి లొంగి వేరే దారిలేక చంద్రబాబు అండ్ కో హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు.

 

ఇదే విషయాన్ని కొడాలి మాట్లాడుతూ విశాఖపట్నం నుండి చంద్రబాబును తరిమేసినట్లే తెలుగుదేశంపార్టీ నుండి కూడా తరిమేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. జగన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నట్లు నాని మండిపడ్డారు. అందుకనే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టటానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.

 

జగన్ ఆలోచనను, ప్రయత్నాలను అర్ధం చేసుకుని రాష్ట్రాభివృద్ధకి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపిని జనాలు ప్రతిపక్షంగా గుర్తిస్తారని చెప్పారు. అలా కాదని మొండికేసి కుట్రలు చేస్తే పార్టీని చివరకు చీ కొట్టి మూలన కూర్చోబెడతారంటూ మంత్రి హెచ్చరించారు.

 

ఏదేమైనా చంద్రబాబు వ్యవహారశైలి చూస్తే జనాలు ఇదే మూడ్ లో ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇందులో భాగంగానే మొన్నటి ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే ఇచ్చి ఘోరంగా ఓడగొట్టారు. అధికారంలో ఉన్నంత కాలం అడ్డదిడ్డమైన అవినీతి, అరాచకాలకు తెరలేపారు. జనాల దెబ్బకు ప్రతిపక్షంలోకి రాగానే ప్రతి విషయంలోను జగన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి టిడిపి నేతలు, కార్యకర్తలు మంత్రి చెప్పిన సూచనను గుర్తిస్తారా ?

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: