ఇటీవల చెలరేగిపోతున్న హింస, మహిళలపై అకృత్యాలు, మద్యం మత్తులో యువత, తెలిసితెలియని వయసులో ప్రేమ.. తదితర వాటిలో సమాజం ఎలా పక్కదారి పడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వయసులో ఆకర్షణే ప్రేమ అనుకుని ఒకరినివిడిచిఒకరు ఉండలేక, పెద్దలకు తెలిస్తే విడగొడతారని భయంతో ఎందరో జంటలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. లేదంటే పెద్దల నుంచీ పారిపోతున్నారు. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ మోజులో పడిన బాలిక ప్రియుడితో కలిసి పరారైన ఘటన విజయవాడ నగరంలో వెలుగుచూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంకు చెందిన 13 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో ఉంటుంది. ప్రస్తుతం ఈమె ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే ఇటీవల సెల్ఫోన్తో ఎక్కువగా గడుపుతూ ఆమె ఓ ఆటోడ్రైవర్తో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ప్రతి రోజూ అతడితో చాటింగ్ చేస్తూ చదువును పక్కకు నెట్టేసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ వయస్సులో ప్రేమేంటని ముందు షాక్కు గురయ్యారు. ఆ తర్వాత ఆమెకు చీవాట్లు పెట్టి.. ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకుని బుద్ధిగా చదువుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఏ మాత్రం బెదరని సదరు బాలిక అతడితో ప్రేమాయణం కొనసాగించింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను విజయవాడ భవానీపురంలో ఉండే మేనత్త వద్దకు పంపారు. అయితే తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సెల్ఫోన్ ఆమె వద్దే ఉంచారు. దీంతో బాలిక మళ్లీ మేనత్త ఇంటి నుంచి ప్రేమ వ్యవహారం స్టాట్ చేసింది. ఇక ఈ నెల 25వ తేదీన మేనత్త ఏదో పనిమీద బయటకు వెళ్లి కాసేపటి తర్వాత వచ్చింది. ఇంతలోనే సదరు బాలక.. ఆటోడ్రైవర్తో జంప్ అయిపోయింది. ఇంట్లో మేనకోడలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఆరా తీసింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెంటనే బాలక తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
దీంతో బాలిక తల్లిదండ్రులు భవానీపురం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి వారిద్దరి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సెల్ఫోన్ సిగ్నల్ ద్వారా ప్రేమజంటను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే చిన్న వయస్సులో ప్రేమ వ్యామోహంలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఇద్దరినీ గట్టిగా హెచ్చరించి ఇంటికి పంపించారు.