ఎవరినైనా విమర్శించాలి అన్న.. ఎవరినైనా తిట్టాలి అన్న అది వైసీపీ ప్రధాన కార్యదర్శి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికే చేతనవుతుంది.. ఎందుకంటే ఎవరైనా సరే విమర్శలు చేశారు అంటే ఆరోజు ట్విట్టర్ వేదికగా వారి బండారం బయటపడిపోతుంది అని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

 

ఇకపోతే ఈరోజు ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి విద్యార్థులకు 20 వేల వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియంలో బోధన. విద్యార్థుల భవిష్యత్తు కోసం రూపొందించిన ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కనిపించవు. పిల్లల నోరుకొట్టి మీరు తాగే హిమాలయ వాటర్ కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ!'' అంటూ ట్విట్ చేశారు. 

 

ఎప్పుడైనా నీ జీవితంలో ఒక్కసారి అయినా పిల్లల కోసం ఏమైనా మంచి పని చేశావా? సీఎం జగన్ చూడు జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజి విద్యార్థులకు 20 వేల వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియంలో బోధన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని మంచి పనులు చేశాడో.. పిల్లల కోసం ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో లేవు.. హిమాలయ మంచి నీళ్ల కోసం కోట్ల రూపాయిలు తగలేశావ్ కానీ.. ఒక్క పిల్లాడికి మంచి చేసిన పాపానికి పోలేదు అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. 

 

దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మంచి చెయ్యడం ఏంటండీ? ఎం మాట్లాడుతున్నారు అండి మీరు అంటూ ట్విట్ చేసారు కొందరు నెటిజన్లు.. మరి కొందరు చంద్రబాబును తిట్టని తిట్టు తిట్టారు అంటే నమ్మండి.. దీంతో ఈ ట్విట్ ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: