చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా జగన్ తన వ్యూహాలతో టెన్షన్ పుట్టిస్తున్నాడు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని విర్రవీగే చంద్రబాబుకి 2019 ఎన్నికల నుండి జగన్ తన ప్లానింగ్ తో ముప్పుతిప్పలు పెడుతున్నాడు అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎన్ని తప్పులు చేశాడో వాటన్నిటినీ అనుభవించేలా ప్రస్తుతం జగన్...తన రాజకీయ ఎత్తుగడలతో చంద్రబాబుని ముప్పతిప్పలు పెడుతున్నారు అని అంటున్నారు.

 

అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులను పరామర్శించడానికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు బస్సులో వెళ్లిన సమయంలో ….అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు చంద్రబాబు బస్సు పై చెప్పుల దాడి ఆ సన్నివేశం గమనిస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు పై చంద్రబాబు చేయించిన చెప్పుల దాడి గుర్తుకు వస్తుంది అంటూ అప్పట్లో కామెంట్ చేయడం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబుని విశాఖపట్టణంలో విమానాశ్రయం బయట ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ విశాఖ ప్రజలు ప్లకార్డులు పట్టుకుని గోబ్యాక్ చంద్రబాబు అంటూ నినదిస్తూ విమర్శలు చేయడం జరిగింది.

 

దీంతో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మరియు నిరసనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో వెంటనే రంగంలోకి దిగారు విశాఖపట్టణం పోలీసులు. వెంటనే చంద్రబాబు తో మాట్లాడి బాబుని హైదరాబాద్ తరలించడం జరిగింది. అయితే ఈ క్రమంలో త్వరలో మళ్లీ విశాఖపట్నం వస్తానని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని చంద్రబాబు సవాల్ విసిరి మరి విమానం ఎక్కారు. అయితే ఈ తరుణంలో ఇదే సంఘటనలు రాబోయే రోజుల్లో చంద్రబాబు కి మరింత పెద్ద అవమానం రావటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే రాజకీయంగా జగన్ తీసుకున్న నిర్ణయాలకు భవిష్యత్తులో బాబోరి కి నిద్రలేని రాత్రులు ఖాయం అని రాజకీయంగా చంద్రబాబుకి బ్యాడ్ డేస్ మొదలయ్యాయని చాలామంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: