తెలంగాణాలో వరుస అమానుష చర్యలు, ప్రజలను.. ముఖ్యంగా ఆడవాళ్లను తీవ్రమైన అభద్రతా భావానికి గురయ్యేలా చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో జరిగిన దారుణమొకటి దీనికి అద్దం పడుతుంది. తన ప్రేమను నిరాకరిచిందని ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. సదరు బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అయితే ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం కొసమెరుపు.

 

IHG

 

వివరాలిలా వున్నాయి.. తిరుమలగిరి మండలం, రాఘవాపురంలో నివసిస్తున్న ఓ అమ్మాయిని, ఒక అబ్బాయి ప్రేమ పేరుచెప్పి చాలా రోజులుగా తన వెంట తిరుగుతున్నాడు. అయితే తనెంతగా వేడుకుంటున్నా, బతిమాలుకుంటున్నా ఆ బాలిక లెక్కచేయడం లేదనీ, తన ప్రేమను పట్టించుకోవడం లేదనీ తీవ్ర కోపోద్రిక్తుడైన సదరు యువకుడు ఆ అమ్మాయిపై పెట్రోలు పోసి, నిప్పంటించాడు. 

 

గమనించిన స్థానికులు, హుటాహుటిన బాలికను వరంగల్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా.. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని, ఆమె పరిస్థితి చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. తమ బిడ్డపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వాడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, అంతే కాకుండా ఏపీ లో అమలు చేసిన దిశా చట్టం, దీనికి వర్తింప చేసి, నిందుతుడిని శిక్షించాలని, వాడిని వురి తీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 

 

IHG

 

కాలం మారినా.. వ్యవస్థ మారినా.. మనుషులు మారడం లేదు. నేటికీ ఆడవాళ్లపైన అరాచకాలు జరుగుతూనే వున్నాయి. బలమైన దిశ లాంటి చట్టాలు వచ్చినా, మృగాడు వెన్నులో వణుకు పుట్టటం లేదు. వాడికి కావలసిన దాని కోసం.. ఎంతటి దారుణానికైనా ఒడి కట్టుతున్నాడు. తనకు దక్కని దాన్ని ఇతరులకు దక్కకూడదని.. తలచి అంతం చేయాలనుకుంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: