విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాద్యాయుడు అదే విద్యార్థునులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువు కీచకానికి పాల్పడిన ఘటన ముంబాయిలో చోటు చేసుకుంది.
స్పెషల్ క్లాసుల పేరుతో బాలికలను లైంగికంగా వేధిస్తున్న కీచక టీచర్ను కటకటాల్లోకి నెట్టారు ముంబయి పోలీసులు. తాను చెప్పినట్లు వింటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని టీచర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. స్పెషల్ క్లాసులకు రాకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నాడు. చివరికి వాడి పాపం పడి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
నవీ ముంబయిలోని మున్సిపల్ స్కూల్లో లోచన్ పరులేకర్(31) అనే వ్యక్తి కంప్యూటర్ టీచర్గా పనిచేస్తున్నాడు. మూడు నెలలుగా 6, 7, 8వ క్లాసుల విద్యార్థులకు స్పెషల్ క్లాస్లు చెబుతున్నాడు. రోజూ సాయంత్రం 6-8 గంటల మధ్య విద్యార్థులను క్లాసులకు రప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమాయక విద్యార్థినుల పట్ల అతడి కన్నుపడింది.
విద్యార్థులను పంపేసిన తర్వాత కొందరు బాలికలను అక్కడే ఉంచుతున్నాడు. వారిని అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధిస్తున్నాడు. తాను చెప్పినట్లు వింటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని, వినకపోతే ఫెయిల్ చేయిస్తానని పరులేకర్ బాలికలను వేధిస్తున్నాడు. కంప్యూటర్ క్లాసులు చెప్పే వంకతో వారి ప్రైవేట్ పార్ట్స్ను తాకుతూ పైశాచికానందం పొందుతున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ధైర్యం చేసి స్కూల్ హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేసింది.
ఈ విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు గురువారం స్కూల్కి చేరుకుని అతడిని నిలదీశారు. అదే సమయంలో మరో 14 మంది బాలికలు కూడా ధైర్యంగా ముందుకొచ్చి కంప్యూటర్ తమను కూడా వేధిస్తున్నారని చెప్పారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు స్కూల్ కి చేరుకుని లోచన్ పరులేకర్ ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని న్యాయస్థానంలో హాజరు పరచగా జడ్జి మార్చి 2వ తేదీ వరకు పోలీస్ కస్టడీ విధించారు.