స్మార్ట్ ఫోన్ లను పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా వదలేకపోతున్నారు. ఏడాది నిండాక ముందే వాటికీ అట్ట్రాక్ట్ అవుతున్నారు. పెరుగుతున్న కొద్దీ లాప్ టాప్ లు, ఫోన్స్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంటర్ నెట్ ను ఏలేస్తున్నారు. అందులో ఎం ఉన్నదో ఇట్టే చెప్పేస్తున్నారు. దీని వారు ఒక్క అలవాటుగా మార్చుకుంటున్నారు. మరికొందరు పిల్లలు టీవీలకు బానిసలు అవుతున్నారు. అందులో వచ్చే ప్రోగ్రామ్స్ కి బాగా అట్ట్రాక్ట్ అయ్యి, వారు ఎలా చేస్తే అలా చేయడానికి ట్రై చేస్తుంటారు.

 

మీ పిల్లలు టీవీల్లో, సెల్‌ఫోన్లలో క్రైమ్ సీన్స్, క్రైమ్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారా? అయితే జాగ్రత్త..! అవి వారిపై ఎంత ప్రభావం చూపుతున్నాయంటే.. టీవీ ప్రోగ్రామ్స్‌లో చూసిన వాటిని ట్రై చేసేంతగా. చివరికి ఆ ఉత్సుకత ప్రాణాల మీదకు తెచ్చిపెడుతోంది. నిత్యం టీవీలో క్రైమ్ ప్రోగ్రామ్స్ చూసే ఓ బాలుడు వాటిని ట్రై చేయాలనుకుని ఉరి బిగించుకున్నాడు. ఎవరూ చూడకపోవడంతో చివరికి ప్రాణాలొదిలేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది.

 

పశ్చిమ బెంగాల్‌లోని మల్దా జిల్లా దువాదిఘి గ్రామానికి చెందిన రజనీకాంత్ సాహా(10) నాలుగో తరగతి చదువుతున్నాడు. సడెన్‌ గా ఓ రోజు గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పదేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 

చిన్నప్పటి నుంచి సాహాకు టీవీలో క్రైమ్ ప్రోగ్రామ్స్ చూడడమంటే పిచ్చి. నిత్యం అవే చూస్తూ ఉంటాడు. ఆ ప్రోగ్రాంలో వచ్చినట్లుగా అనుకరించబోయి ఇలా ఉరి వేసుకుని ఉంటాడని బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో ప్రాణాలు పోయి ఉంటాయని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  

 

పిల్లలకు పరిమిత వయస్సు వచ్చే వరకు ఇంటర్ నెట్, టీవీ, మొబైల్ ఫోన్స్ కి దూరంగా ఉంచాలి. అలా చేస్తే కొంత వరకు అయినా ఇలాంటి ఘటనలను అరికట్ట వచ్చును. 

మరింత సమాచారం తెలుసుకోండి: