తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ తేజ. ఇప్పటికే ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు. ఇక రానా హీరోగా తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి తర్వాత డైరెక్టర్ తేజ కి చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్య కాలంలో డైరెక్టర్ తేజ పలు  సినిమాలు తెరకెక్కిస్తున్నాడు అని వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు మాత్రం  రాలేకపోయారు డైరెక్టర్ తేజ  . అయితే తాజాగా డైరెక్టర్ తేజ రెండు చిత్రాల్ని ప్రకటించారు. అయితే తేజ తెరకెక్కించే రెండు సినిమాలకు సంబంధించి టైటిల్స్ ప్రకటించినప్పటికీ ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు ఎవరు అనే దానిపై మాత్రం ఎలాంటి వివరాలు లీక్  చేయలేదు డైరెక్టర్ తేజ. రాక్షసరాజు రావణాసురుడు, అలిమేలు మంగ వెంకటరమణ అనే టైటిల్ తో సినిమాలని  ప్రకటించారు డైరెక్టర్  తేజ. 

 

 

 వీటిలో ఆక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా అలివేలుమంగ వెంకటరమణ సినిమా తెరకెక్కనుందని తాజా సమాచారం. అయితే మొదటి నుంచి ఈ సినిమాలో కాజల్ ను కథానాయిక సెలక్ట్ అయ్యిందని  అని ప్రచారం జరిగినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం మాత్రం కీర్తి సురేష్ గోపిచంద్  సినిమాలో  హీరోయిన్ గా సెలెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహానటి లాంటి క్లాసిక్ హిట్ సినిమాల్లో నటించిన తర్వాత కీర్తి సురేష్ కు అంత స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో అటు కీర్తి సురేష్ కు కూడా తేజ సినిమాలో మంచి పాత్ర అనే చెప్పాలి. 

 

 

 అయితే కీర్తి సురేష్ ఇప్పటికే బాలీవుడ్ లో ఓ సినిమా కమిట్ అయింది. ఇక ఈ మధ్య జిమ్ కి వెళ్లి బాగా సన్నగా  కూడా అయింది. ఇకపోతే తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం నేనే రాజు నేనే మంత్రి సినిమా లో కాజల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయం కూడా అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తేజ సినిమాలో  కాజల్ ముచ్చటగా మూడోసారి నటిస్తుంది అనుకుంటున్న సమయంలో తెరమీదకు కీర్తి పేరు వచ్చేసింది. ఇక రాక్షసరాజు రావణాసురుడు అనే టైటిల్ బాగుంది. ఇందులో నటించే హీరో ఎవరు అనే దానిపై  ప్రస్తుతం అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఇంకొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన సమాచారం కూడా అంతే అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: