ఆడవారిపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ... ఉరిశిక్షలు అమలు అవుతున్నప్పటికీ... పోలీసులు దారుణంగా ఎన్కౌంటర్లు చేస్తున్నప్పటికీ కామాంధుల తీరులో  మాత్రం ఎలాంటి మార్పు రావడంలేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలు లైంగిక వేధింపులకు గురవడం అత్యాచారాలకు గురవడం లాంటి ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాల్లు  ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తున్నారు. తెలంగాణలోని షాద్నగర్ సమీపంలో మెటర్నిటీ వైద్యురాలు దిశ ఘటన మరువక ముందే ఎన్నో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. 

 

 

 తాజాగా తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురం లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను నిరాకరించిందన్న  కోపంతో బాలికపై అత్యాచారం చేశాడు... అనంతరం ఆ యువతి ప్రాణం కూడా తీయాలి అనుకున్నాడు. ఇక అనుకున్నట్టుగానే ఆ యువతి పై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు దుండగుడు. ఇక  తీవ్ర గాయాలపాలైన బాధితురాలు... వరంగల్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ ఘటన పై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వెంకటేష్ గా  గుర్తించారు.

 

 

 నిందితుడు వెంకటేష్ గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో  ఆ బాలిక వెంటపడుతున్నాడు. ఇక ఆ బాలిక ప్రేమకు  ఒప్పుకోక పోవటంతో..వేధించటం మొదలు పెట్టాడు. ఆ బాలిక మాత్రం వెంకటేష్ ప్రేమను నిరాకరించింది... దీంతో ఆ బాలిక పై తనకున్న కామ వాంఛ తీర్చుకోవాలని భావించాడు  వెంకటేష్... ఆమెను దారుణంగా అత్యాచారం చేసి అనంతరం... పెట్రోల్ పోసి నిప్పు అంటించి నట్టు విచారణలో వెల్లడైంది. నిందితుడిపై పోక్సో చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: