అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్ చాలా దూకుడుగా ప్రత్యర్థులపై వేస్తున్న వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే హైలెట్ న్యూస్ గా మారుతున్నాయి. తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లో భారీగా దిమ్మతిరిగిపోయే విధంగా దెబ్బకొట్టిన జగన్...అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోయే విధంగా వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు మహా మహా రాజకీయ నేతలకు మతి పోతున్నాయని చాలామంది రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. అసలు చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి తప్పులు చేయడం జరిగిందో వాటన్నిటినీ పైన ఉన్న దేవుడు జగన్ చేత చంద్రబాబుని శిక్షించే విధంగా పరిస్థితులు మారుస్తున్నారని చాలామంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయంపై కామెంట్ చేస్తున్నారు.

 

టిడిపి పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటివరకు ఎన్నడూ లేని రాజకీయ సంక్షోభం ప్రస్తుతం టీడీపీ ఎదుర్కొంటుందని చంద్రబాబుకి కచ్చితంగా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఒక పక్క సీట్ మరోపక్క పార్టీల నాయకులు వెళ్లిపోవడం అంతా చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైనట్లు ఏపీలో కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల తనని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో వైజాగ్లో అవమానించడం జరిగిందో అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుని విశాఖపట్టణం విమానాశ్రయం బయట రోడ్డుపై కూర్చోబెట్టడం నిజంగా హైలెట్ అని చాలా మంది జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి లో ఉన్న నాయకులు వ్యాఖ్యానించడం జరిగింది.

 

అయితే ఈ సంఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో హైలెట్ అవటంతో చాలా వరకు మీడియా రంగంలో ఆంధ్ర రాజకీయాల గురించి వైజాగ్ ప్రజలు భయపడుతున్నారని వార్తలు ప్రసారం చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖపట్టణానికి ఉన్న మంచి పేరు కూడా జగన్ కోడి కత్తి మరియు తాజాగా విమానాశ్రయం బయట చంద్రబాబుని అరెస్టు చేయడం ఇటువంటి సంఘటనలు విశాఖ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: