ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసిపి అన్నట్టుగానే ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసినదే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలలో కలుగుతున్న ఆదరణ చూసి టీడీపీ శ్రేణులు కుళ్ళు పోతున్నారని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇందువల్లనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావటానికి ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అధికారంలో ఉన్న వైసిపి ప్రజాప్రతినిధులపై దాడి చేసి మరి రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వాన్ని చేస్తున్న మంచి పనులని చూసి తట్టుకోలేకపోతున్నాడు అంటూ వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఇటీవల చంద్రబాబు నాయుడు విశాఖపట్టణం విమానాశ్రయం బయట వ్యవహరించిన తీరు పట్ల వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి అందరికీ తెలిసినదే. తాజాగా ఇదే రీతిలో నారా లోకేష్ పై సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు. ఆయన ఏమన్నారంటే వైద్య శాస్త్రంలో ఎక్కడా కనిపించని ఓ రోగం, రాష్ట్రంలోని తండ్రీ కొడుకులను పట్టుకుందని, దాని పేరు ‘పులివెందుల ఫోబియా’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన కామెంట్ ద్వారా సెటైర్ వేశారు. అబ్బా కొడుకులకి మాటిమాటికీ పులివెందుల గోల ఎందుకయ్యా మీకు అంటూ మండిపడ్డారు.

 

“వైద్య శాస్త్రాల్లో ఎక్కడా ప్రస్తావన లేని ఫోబియా తండ్రీ, కొడుకులకు పట్టుకుంది. ‘పులివెందుల ఫోబియా’ ఒకటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తక్షణం నోటిఫై చేయాలి. లేకపోతే ఎక్కడ ఇద్దరు వాదులాడుకున్నా అందులో ఒకరు పులివెందుల నుంచి వచ్చాడని వణికి చచ్చేట్టున్నారు” అని విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా లో కామెంట్ చేశారు. దీంతో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: