అమ్మాయిలపై తమ కుటుంబ సభ్యులు చేస్తున్న అమానుష చర్యలను చూస్తుంటే ప్రతి ఒక్కరికి కోపం కట్టలు తెంచుకుంటుంది. కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్ విద్యార్థిని ఓ అబ్బాయిని ప్రేమిస్తుందని కుటుంబ సభ్యులే ఆమెని గన్ను తో కాల్చేసి చంపేశారు. ఆ షాకింగ్ సంఘటన మరవక ముందే మరో అమ్మాయి పై తన కుటుంబ సభ్యులు సిగ్గుమాలిన దారుణానికి ఒడిగట్టి అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నారు. 

 


వివరాలు తెలుసుకుంటే... మధ్యప్రదేశ్ రాష్ట్రం అలిరాజపూర్ లోని సోండ్వా పోలీస్ స్టేషన్ ఈ ప్రాంతంలోని డాబ్రీ గ్రామానికి చెందిన గిరిజన మైనర్ బాలిక హోలీ ఫాలియా(15) భంగాడియా అనే యువకుడితో ఫోనులో మాట్లాడుతుందనే అనుమానంతో తల్లిదండ్రులు, మామయ్య ఆ బాలికపై కోపం పెంచుకున్నారు. ఐతే ఫిబ్రవరి 25 తేదీన బాలిక అలీరాజ్‌పూర్ బస్‌స్టాండ్‌కు వెళ్లగా... ఆమెను తన కుటుంబం అనుసరిస్తూ వచ్చారు. బాలిక తన ప్రియుడిని కలవడానికే ఇక్కడకు వచ్చిందని అనుమానించిన ఆ కుటుంబం బాలికను తన గ్రామానికి కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకొచ్చి ఊరి నడిబొడ్డున పడేశారు. ఆ తరువాత బాలిక మామయ్య తన జట్టుని బలవంతంగా కత్తిరించాడు. ఊరి ప్రజలంతా ఈ దారుణం చూస్తుండగా... ఆ బాలిక తనకు జరుగుతున్న అవమానం భరించలేక కన్నీరుమున్నీరైంది. 

 


ఐతే తనకు జరిగిన ఘటన గురించి బాలిక పోలీస్ ఠాణా లో ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని... బాలిక ని కొట్టినందుకు, అందరి ముందు జట్టు కత్తిరించి అమ్మాయి పరువుకు భంగం కలిగించినందుకు ముగ్గురు కుటుంబ సభ్యులను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసారు. ఐతే, ప్రస్తుతం బాలిక జట్టు కత్తిరిస్తున్న వీడియో సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. నెటిజనులు ఈ వీడియో చూసిన తరువాత ఆ కుటుంబ సభ్యులకు కఠిన కారాగార శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమాయక బాధితురాలిని ఏదైనా బాలికల ఆశ్రమం లో చేర్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: