మహిళలపై ఆగని అకృత్యాలు, నలుగురిలో ఒకరిపై లైంగిక దాడి, అరగంటకో ఘటన.. ఇలా ప్రతి రోజు ఎక్కడో ఒక దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మగాళ్లు మృగాలుగా మరి.. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఏ పేపర్ తిరిగేసినా, ఏ వార్తా ఛానెల్ చూసిన దేశంలో ఏదో ఒక మూలాన అత్యాచార ఘటనలు, కిడ్నాప్ ఘటనలు, హత్యా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇటీవల సూర్యాపేటలో ప్రేమను నిరాకరిచిందని ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. కానీ, ఈ దారుణ ఘటనలో మరో ట్విస్ట్ బయట పడింది.
సదరు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ముందు దారుణంగా రేప్ చేసినట్టు విచారణలో తెలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు, ఇక కొడుకు సంతానం. మొదటి కూతురికి వివాహం కాగా.. రెండో కూతురు పారా మెడికల్ కోర్సు అభ్యసిస్తోంది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
అయితే వెంకటేశ్ సదరు బాలికను గత రెండేళ్లుగా తనను ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. కానీ, అతను వెంటపడి, బతిమిలాడుకున్న ఆమె పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టి వెంకటేశ్ని మందలించారు. దీంతో అతనిలోని మానవమృగం నిద్రలేచింది. ఉన్మాదిగా మారిన వెంకటేశ్.. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లోకి చొరబడ్డాడు. బాలికను సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి ఘోరంగా అత్యాచారం చేశాడు. ఆమెపై పడి కామవాంఛ తీర్చుకుని.. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అది గమనించిన స్థానికులు.. బాలికను వరంగల్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలిక కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకొని, ఆమె పరిస్థితి చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో, హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.