ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మిగతా వారిమాదిరిగా కులగజ్జి లేదని సినీనటుడు పోసాని కృష్ణమురళి అన్నారు . అమరావతి ఒకే సామాజికవర్గం రాజధానిగా మారిందని గతం లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఖండించిన తరువాత జగన్ తో మీకు గ్యాప్ పెరిగినట్లుందన్న ప్రశ్నకు పోసాని స్పందిస్తూ కొంతమంది మాదిరిగా జగన్ కు కుల గజ్జి అస్సలు లేదని, తనకు ఆ విషయం తెలుసునని చెప్పారు . పృథ్వీలాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలతో జగన్ విశ్వసనీయత ఏమి కావాలని తాను స్పందించానంతేనని చెప్పుకొచ్చారు . జగన్ పై తాను అలగడం కానీ తనపై జగన్ అలగడం కానీ ఈ జన్మ కు జరగవని అన్నారు .
ఎన్నికల ముందు జగన్ కు ఒక్కసారి ఓటెయ్యమని తాను కోరానని , ఒక్కసారి ఓటేస్తే ఆయన పాలన చూసి పదేపదే ఓటేస్తారని ప్రజలకు చెప్పానని వివరించారు . జగన్ ముఖ్యమంత్రి అయ్యారని , తన కోరిక నెరవేరిందన్న పోసాని ... ఇప్పుడు కూడా తాను జగన్ పక్కనే ఉండి ఏమి చేయాలని ఎదురు ప్రశ్నించారు . తనకు పదవుల మీద వ్యామోహం లేదని , సేవ చేయడానికి సిద్ధమేనన్న పోసాని , కొన్ని నెలల క్రితమే తనను పదవి విషయం లో సంప్రదించారని చెప్పారు . తాను దానికి అంగీకరించలేదని అన్నారు . అయితే ఎస్వీబీసీ చైర్మన్ గా తొలుత పృథ్వీ ని నియమించి , పోసానిని జగన్ విస్మరించారన్న ఊహాగానాలు విన్పించాయి .
అందుకే గతం లో అమరావతిపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై పోసాని తీవ్ర స్థాయి లో విమర్శలు చేయడం వెనుక తనని కాదని పృథ్వీకి పదవి కట్టబెట్టారన్న అక్కసుతోనే ఆరోపణలు విన్పించాయి . అయితే అంతలోనే ఎస్వీబీసీ మహిళా ఉద్యోగిణితో అసభ్య ఫోన్ సంభాషణ కారణంగా పృథ్వీ ని చైర్మన్ పదవి నుంచి తప్పించిన విషయం తెల్సిందే . పృథ్వీ వ్యాఖ్యలపై గతంలోతాను ఎందుకు ఘాటుగా స్పందించానో ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పోసాని వెల్లడించారు .