వారిద్దరు ఒకరిని ఒకరు వదిలి ఉండలేము అని అన్నారు.. తమ ప్రేమకు తిరుగు లేదంటూ చెట్టపట్టాలేసుకొని తిరిగారు. తర్వాత ప్రియురాలు చేతులు తలకేసుకుని కూర్చుంది. ప్రియుడు తన ప్రియురాలిని ప్రేమిస్తున్నానని నమ్మించి.. శారీరకంగా వాడుకొని అన్ని అయిపోయాక, మోజు తీరాక వదిలేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుని ఇంటి ముందు ప్రియురాలి న్యాయ పోరాటం చేస్తోంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటాననీ, శారీరకంగా వాడుకోని ఇప్పుడు మొకం చాటేయడంతో యువకుని ఇంటి ఎదుట అమ్మాయి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మండలం అడ్లూరుకు చెందిన తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెరుమాండ్ల రాజ నరసింహులు కుమారుడు పెరుమాండ్ల పవన్ సమురాయ్ అదే గ్రామానికి చెందిన అంకాడి సుప్రియా అనే యువతి ప్రేమించుకున్నారు. సుప్రియ అనే యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరకంగా వాడుకొని 5 నెలల గర్భవతిని చేసి గర్భాన్ని తొలగించేందుకు మెడిసిన్స్ ఇచ్చి తల్లిదండ్రులతో పాటు పవన్ కూడా బలవంతంగా వేశారు.
దీంతో ఆమె గర్భస్రావం, రక్త స్రావం జరిగి సీరియస్ కాగా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇప్పుడు సుప్రియ కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకొమ్మని అడిగితే చేసుకోనని చెబుతుడడంతో యువతి, సదరు వ్యక్తి ఇంటి ఎదుట నిన్న రాత్రి నుంచి ధర్నా చేస్తుంది. సుప్రియ తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. పవన్ తనను పెళ్లి చేసుకునే విధంగా చూడాలని పోలీసులను సైతం కోరింది. అధికార పార్టీ నాయకుడు కావడంతో పోలీసులు సైతం పట్టించుకోలేదని సమాచారం.
ఒకవైపు ఇలాంటి సంఘటనలకు ఎలాంటి చర్యలు తీసుకున్న మళ్లీ మళ్లీ ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా కానీ.. మోసపోతునే ఉన్నారు. సుప్రియ కు న్యాయం జరగాలని కోరుకుందాం...