జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయం ఏ మాత్రం ప్రణాళిక లేకుండా...అన్ని విషయాల్లో గోప్యత పాటిస్తూ పరిపాలన సాగిస్తోందని   స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో సాగుతున్నది ఫ్యాక్షన్ పాలనే 
జనసేన పీఏఏసీ చైర్మన్ అన్నారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలి అన్నదే జనసేన పార్టీ విధానం, పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆలోచన అని తెలిపారు. సోమవారం సాయంత్రం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ సమీక్ష సమావేశం నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. 

 


ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ “రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, శ్రేణులు సమాయత్తం కావాలి. మనం భారతీయ జనతా పార్టీతో కలసి పని చేస్తున్నాం. మన పార్టీ, బీజేపీ కలసి పని చేసేందుకు సమన్వయ కమిటీలు కూడా నియమించుకున్నాం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు సంబంధించి ఇంచార్జులు, కమిటీలను కొద్ది రోజుల్లో ఖరారు చేస్తాం. కమిటీల్లో పార్టీ కోసం తపించి, పని చేసిన యువతకు సముచిత ప్రాధ్యానం ఇవ్వాలి అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే నాయకులు ప్రతి సందర్భంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకొంటూ ముందుకు వెళ్తున్నాం. పార్టీ కోసం పని చేసినవారికి పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది.`` అని స్ప‌ష్టం చేశారు.  

 

 

పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తిని క్షేత్ర స్థాయి వరకూ తీసుకువెళ్లాలి అని నాదెండ్ల కోరారు. ``వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. చట్టంలో చెప్పిన వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం ఏ మాత్రం దృష్టిపెట్టలేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలే చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఈ మేరకు లేఖలు వస్తున్నా స్పందించడం లేదు. మూడేళ్లపాటు వచ్చిన నిధులకు యూసీలు ఇవ్వలేదు. అవి ఇస్తే నిధులు వస్తాయి. అలాగే ఇతర నిధులు కూడా తెచ్చుకోవడం లేదు. గత ప్రభుత్వంలో కూడా రూ.3 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. అవి ఎలా వినియోగించారు. ఈ పాలకులకు విశాఖపట్నంపై దృష్టి ముందు నుంచి ఉంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి ఉమ్మడి రాష్ట్రంలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు.. అప్పటికే ఇక్కడ ఉన్న ఆస్తులను ఎలా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే అలా వచ్చారు. ఇప్పుడు పాలన రాజధాని అంటున్నారు. అందులోనూ గోప్యతే. అర్థరాత్రి జీవోలు ఇస్తారు. అవీ గోప్యంగా ఉంచుతారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: